దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న ముంబైలో బయటి ప్రపంచానికి తెలియని చీకటి కోణాలు ఎన్నో ఉన్నాయి. లక్షల మంది అక్కడ పొట్ట కూటి కోసం వస్తుంటారు..పోతుంటారు. అయితే ఎవరికి నచ్చిన వృత్తిని వాళ్లు చేసుకోవచ్చు. అయితే కొంత మంది వ్యభిచారం చేసి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే ముంబైలో రెడ్ లైట్ ఏరియా గురించి దేశంలో వాళ్లందరికి తెలుసు. అయితే తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేండ్ర ఫడ్నవిస్ వ్యభిచారిణిలపై ఉక్కు పాదం మోపారు. అంటే ఆయన వాళ్లను కొట్టడం... లేదా ఇంకోటో చేశారని అనుకోకండి. అక్కడి వాళ్లకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయన్న కంప్లైంట్ తో ఫడ్నవిస్ చర్యలకు దిగారు.
నగరంలోని కామాథిపూరా వాసులు సెక్స్ వర్కర్లపై కొరడా ఝుళిపించేందుకు సన్నద్ధమయ్యారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్ లైట్ జిల్లాగా పిలవబడే కామాథిపూరా ప్రాంతపు సెక్స్ వర్కర్లు తమ కార్యకలాపాలను విచ్చలవిడిగా కొనసాగించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా సెక్స్ వర్కర్ల వ్యాపారానికి అడ్డుకట్ట వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలోనూ చాలా మందికి త గోడును వెల్లబోసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. అందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాలకు లేఖలు రాశారు. ఆ సెక్స్ వర్కర్లను వేరే చోటకు తరలించాలని రెండు వేల మందికి పైగా స్థానికులు వినతి పత్రాలు సమర్పించారు. వారి కార్యకలాపాలను 11 వ వీధిగా మాత్రమే పరిమితం చేయాలని ఆ లేఖలో కోరారు. సెక్స్ వర్కర్ల కార్యకలాపాలతో మా పిల్లలకు స్కూల్ ల్లో అడ్మిషన్లు దొరకడం లేదు. మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదు. బంధువులు కూడా మా ఇంటికి రావడం లేదు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే స్థానికులకు కలుగుతున్న ఇబ్బందుల మాట వాస్తవమే అయినా.. సెక్స్ వర్కర్లను ఉన్న పలంగా ఖాళీ చెయ్యమంటే వారి పరిస్థితిని కూడా ఆలోచించాలి మరి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more