వేధింపులు తాళలేక ఓ భార్య తన భర్తనే హతమార్చాలని శతవిధాల ప్రయత్నించింది. రోజూ తనతో గొడవపడటంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె.. ఓపిక నశించి ఈ దారుణం చేసేందుకు ఒడిగట్టింది. ప్లాన్ ప్రకారమే అన్నీ సిద్ధం చేసింది కానీ.. భర్త ఆమె చేతిలో ‘చావు’ బయటపడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోకి తిరుపూరులో చోటు చేసుకుంది.
తిరుపూరులో వంజియమ్మాళ్, కన్నన్ భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరుచూ గొడవలయ్యేవి. ఈ క్రమంలోనే ఇటీవలే మరోసారి వీరిద్దరూ గొడవ పడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వంజియమ్మాళ్.. తన భర్తను చంపాలని ప్లాన్ చేసింది. పథకం ప్రకారమే ఆమె నిద్రపోతున్న భర్త కళ్లు, చేతులు కట్టేసింది. అనంతరం అతని ముఖానికి పాలిథీన్ కవర్ బిగించి.. ఊపిరాడకుండా చేసి హత్యచేయాలని ప్రయత్నించింది. అయితే.. ఊపిరి ఆడకపోవడంతో మేల్కొన్న భర్త కన్నన్.. జరుగుతున్న మొత్తం వ్యవహారాన్ని గ్రహించి అరవసాగాడు. అతని అరుపులకు పిల్లలు మేల్కొని వాళ్లు కూడా భయంతో అరవడం మొదలుపెట్టారు. దాంతో ఆమె తన భర్తను ఎలాగైనా అంతమొందించాలని భావించి.. కట్టెతో కొట్టింది. తర్వాత కొడవలితో కూడా దాడి చేసింది.
అయితే.. పిల్లలు గట్టిగా అరుపులు వేయడంతో ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకున్నారు. భర్త కన్నన్ ను చంపుతున్న వంజియమ్మాళ్ ను చుట్టుముట్టి అతడిని కాపాడి, ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆమెను వంజియమ్మాళ్ పోలీసులకు లొంగిపోయింది. భర్త పెట్ట చిత్రహింసలు భరించలేక తాను హత్య చేయాలని ప్రయత్నించానని ఆమె వెల్లడించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more