సంస్థను నడిపించేందుకు మంచి ఆలోచనలతో పాటు ఉద్యోగులంటే ఔదార్యం కూడా వుండాలని అంటున్నాడు ఇక్కడ ఓ కుర్ర సీఈఓ. ఇలాంటి మాటలను చెప్పాలంటే.. ముందు మీరు ఏదేనా చేయాలి ఆ తరువాతే చెప్పాలి అంటున్నారా..? ఆయన అలాంటి పనిచేసే సంచలనం సృష్టించారు. ఒకటి రెండు కాదు ఏకంగా తన రెండు వందల కోట్ల రూపాయల వ్యక్తిగత షేర్లను సంస్థలోని కార్మికులకు దారాదత్తం చేశారు. ఎవరాయనా.. అంత ఔదార్యమున్న సీఈఓ ఎవరు..? ఏమా కథ అంటున్నారా..?
హౌసింగ్డాట్కామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ యాదవ్ ఆ కంపెనీలో ఉన్న తన వాటా మొత్తాన్ని ఉద్యోగులకు కానుకగా ఇచ్చివేశారు. కంపెనీ సీఈఓగా రాజీనామా చేసి, ఆ రాజీనామాను ఉపసంహరించుకున్న ఆయన.. వారం రోజుల్లోనే ఇలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తన ఈ నిర్ణయంతో సంస్థలోని ఉద్యోగులందరినీ ఆయన వాటాదారులను చేశారు. 2012లో స్థాపించిన ఈ సంస్థ గత ఏడాది సుమారుగా 120 మిలియన్ డాలర్లను సంపాదించగా, ఈ ఏడాది 90 మిలియన్ డాలర్లను ఆర్జించిందని, ప్రస్తుతం సంస్థ సుమారుగా 300 మిలియన్ డాలర్ల టర్నోవర్ తో సాగుతుందని సమాచారం.
తన సంస్థ హౌసింగ్ డాట్కామ్లో పనిచేస్తున్న మొత్తం 2,251 మంది ఉద్యోగులకు ఆయన తన వ్యక్తిగత షేర్లను ఇచ్చివేశారని డాట్కామ్ వెల్లడించింది. ఈ వాటా విలువ ఉద్యోగుల ఏడాది వేతనానికి సమానమని పేర్కొంది. రాహుల్ యాదవ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని త్వరలో బోర్డు కూడా అమోదించనుందని సమాచారం. తన వయస్సు 26 సంవత్సరాలేనని, ఇప్పుడే డబ్బు గురించి సీరియస్గా ఆలోచించడం తొందరపాటవుతుందనే ఉద్దేశంతోనే ఈ వాటాను ఉద్యోగులకు ఇచ్చినట్లు యాదవ్ పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more