ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రజలు, ఉద్యోగులు, వారి హక్కులు గుర్తుండే నేతలకు అధికారంలోకి వస్తే మాత్రం అవన్నీ హరించుకుపోతాయి. తమ ప్రభుత్వమే అధికారంలో వుందన్న ధీమాతో ఏం చేసినా చెల్లిపోతుందన్నట్లు వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి మేనకా గాంధీ వ్యవహారం కూడా అలానే వుంది. దేశ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ కుటుంబానికి చెందిన కోడలుగా అమెకు దేశ ప్రజలలో ఎంతో సముచిత స్థానం వుంది. అయితే ఇన్నాళ్లు అమె తన స్థానాన్ని పథిలంగా కాపాడుకుంటే వచ్చారు. కానీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు అమె చర్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి.
కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనను కొట్టారని ఓ ఫారెస్టు గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ను మీదుగా వెళ్తున్న మేనకా గాంధీ.. అడవిలో మంటలు వ్యాపించి పోగలు వస్తుండడాన్ని గమనించి స్థానిక గర్క చెక్ పోస్టు వద్ద వున్న ఫారెస్టు అధికారుల్ని నిలదీశారు. స్థానిక రైతులు గోధుమ పంటల్ని తగలబెట్టడం వల్లే మంటలు అడవులకు వ్యాపిస్తున్నాయని చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తిస్తున్న 57 ఏళ్ల కాపలాదారు రూప్ లాల్.. మంత్రికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను మాట్లాడుతుండగా మధ్యలో కలిగించుకున్న కాపలాదారుపై మంత్రి అంతెత్తున ఎగిరిపడ్డారు. 'అసలు అడవులు తగలబడటానికి కారణం నువ్వే' అంటూ చెంపపై ఒక్కటిచ్చారు. ఊహించని పరిణామానికి రాంగోపాల్ వర్మ బిత్తరపోయాడు. ఆ సమయంలో ఫారెస్టు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలంలోనే ఉన్నప్పటికీ కిమ్మనకుండా ఉండిపోయారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మేనకాగాంధీ తనపై దౌర్జన్యం చేశారని బాధితుడు బైరేలిలోని గజ్ రౌల పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ కుమార్ బుద్దప్రియే తెలిపారు. కనీసం ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారా అన్న ప్రశ్నకు స్పందించిన ఆయన.. అవన్నీ దర్యాప్తు తర్వాతే చేస్తామని.. ఎఫ్ఐఆర్ అర్థాన్ని కూడా మార్చేశారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more