ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో తెలియదంటూ.. కేంద్ర హోం శాఖ వెలువరించిన ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో.. అతను పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని, అతడిని ఎలాగైనాఇండియాకు రప్పించి తీరతామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి సోమవారం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశారు. దావూద్ పాకిస్తాన్లో ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. అతణ్ని ఇండియాకు అప్పగించాలనే విషయంపై పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు. ఇక ఈ వివాదానికి తొందరలోనే ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.
కాగా గతంలో లోక్సభలో దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత ప్రక్రియ మొదలవుతుంది’ అన్న హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి ప్రకటన దుమారం రేపింది. నిత్యానంద్ రాయ్ అనే సభ్యుడికి ఈమేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్పై రెడ్ కార్నర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నోటీసులున్నాయి. దావూద్ పాక్లో ఆ దేశ భద్రతా బలగాల అండతో తలదాచుకుంటున్నాడని భారత ప్రభుత్వం పలు వివరాలను పాక్కు అందించడం, అతన్ని తమకు అప్పగించాలని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గత ఏడాది డిమాండ్ చేశారు. . దీనికి భిన్నంగా హరిభాయ్ ప్రకటన.. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. ఈ నేపథ్యంలోనే లోక్సభలో సర్కారు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more