మన నేతాగణం నోటికి వచ్చినంత మాట్లాడటం తర్వాత నాలుక్కరుచుకోవడం మామూలైపోయింది. అయితే బారతదేశానికి ఉన్న అతి పెద్ద రాజ్యాంగం అందరికి అవకాశం కల్పిస్తోంది. అందుకే ఇలా ఏమాత్రం అటుఇటుగా మాట్లాడినా.. వెంటనే పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు జనం. కాస్త లా మీద పట్టుంటే చాలు కోర్టు మెట్లెక్కుతున్నారు. అయితే అలా కేసుల విషయంలో రాజకీయ నాయకులు విసిగిపోతున్నారు. ఎన్నికల్లో ప్రత్యర్థుల మీద అవాకులు చవాకులు పేలడం తర్వాత కోర్టు చుట్టు తిరగడం మామూలైపోయింది. అయితే ఇలా తిరిగి తిరిగి విసిగిపోయిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకెక్కారు. తన మీద వేసిన పరువు నష్టం దావాలకు పాపం విసిగిన రాహుల్ బాబు ఇలా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
విచక్షణారహితంగా పరువునష్టం దావాలు మీదపడడంతో విసిగి పోయిన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. పరువునష్టం దావాల్లో క్రిమినల్ అంశాన్ని తొలగించాలని, ఈ కేసుల్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టును అర్థించారు. 2014 ఎన్నికల ర్యాలీలో మహాత్మాగాంధీ హత్యకు ఆరెస్సెస్సే కారణమన్న రాహుల్ గాంధీపై పరువునష్టందావా దాఖలైంది. ఈ కేసు కొట్టేయాలన్న రాహుల్ అపీలును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు ఆదేశించింది. తన అప్పీల్ ను కొట్టవేయడంపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు గుమ్మం తొక్కారు. రాహుల్ పిటిషన్ జస్టిస్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్ ఎదుటకు వచ్చింది. పరువునష్టం కేసుల విషయంలో రాజ్యాంగ సూత్రాలను ప్రశ్నించింది.ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుంతే చేసిన ఫిర్యాదును కొట్టివేయాల్సిందిగా కోరుతూ రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని థానే జిల్లా భివాండి లోని మెజిస్టీరియల్ కోర్టుకు చేసిన అపీలును బాంబే హైకోర్టు మార్చి 10న కొట్టివేసింది. పరువునష్టం కేసుల విషయంలో రాజ్యాంగ సూత్రాలను ఈ పిటిషన్ లో ప్రశ్నించారు. పరువునష్టం కేసుల్లో క్రిమినల్ అంశం తొలగింపునకు సంబందించి బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు ఆలకిస్తుంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more