ఎక్కువ చదివి.. చదివి మా ఊర్లో ఒకతను పిచ్చోడయ్యాడు అని మన చుట్టు పక్కల వాళ్లు చాలా మంది అంటుంటే విన్నాం.. కాస్త డౌట్ గా ఉన్నా... నమ్మేస్తాం. ఎందుకంటే అప్పుడప్పుడు మనకు కూడా గట్టిగా చదివితే బుర్రవేడెక్కిపోద్ది మరి. చదివిస్తే ఉన్న మతి పోయిందని ఓ సామెత. అయితే ఇది నిజంగానే నిజమంటోంది ఓ సర్వే. రానురాను విద్యార్థుల్లో పరిజ్ఞానం తగ్గుతోందని చెబుతోంది. ఉద్యోగాలు పొందేందుకు..విద్యార్థుల దగ్గర ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ పై రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ సర్వే నిర్వహించింది తెలంగాణ స్కిల్ మిషన్. ఇందులో టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీకి వెళ్లే సరికి విద్యార్థుల్లో ఓపిక, సహనం తగ్గుతుందని తేలింది. దీంతో పాటు విద్యాప్రమాణాలు కూడా తగ్గుతున్నాయని చెప్పింది ఆన్ లైన్ సర్వే. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంటే.. ఐటీఐ, పాలిటెక్నిక్ చదవిన విద్యార్థుల్లో టాలెంట్ ఎక్కువగా ఉందంటోంది సర్వే రిపోర్ట్.
హైదరాబాద్ లో ఉండే విద్యార్థుల కంటే..ఆదిలాబాద్ విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నాయని ఆన్ లైన్ సర్వేలో తేలింది. టెన్త్ నుంచి పీజీ చదువుతున్న 11,570 మంది విద్యార్థులకు..ఒకే రోజు ఆన్ లైన్ లో టెస్టు నిర్వహించారు. ఈ ఎగ్జామ్ లో ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన సామర్థ్యాలపై క్వశ్చన్స్ అడిగారు. అయితే ఇందులో ఒక్క విద్యార్థి కూడా అర్హత సాధించలేదు. ఆన్ లైన్ టెస్టుతో ఉన్నత విద్యార్హతలు ఉన్నవారి కంటే..టెన్త్ క్లాస్ విద్యార్థుల్లోనే టాలెంట్ ఉందని తేలింది. అటు అన్ని అంశాల్లో ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థుల కంటే..గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన వారిలోనే తెలివి తేటలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. టెన్త్ క్లాస్ చదవిన వారి కంటే..పీజీ విద్యార్థుల దగ్గర 12.8 శాతం స్కిల్స్ తక్కువగా ఉన్నాయని తేలింది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more