తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొలువుదీరింది. ఆలయ సన్నిధిలో ఉదయం చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అనంతరం బోర్డు సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేశారు. గతవారమే పాలకవర్గాన్ని ఖరారు చేస్తూ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నా.. మంచి ముహూర్తం కొసం పాలక మండలి ప్రమాణ స్వీకారం కోసం వేచిచూసింది. మొత్తానికి ఈ ఉదయం పాలక మండలి కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, హాజరయ్యారు. చైర్మెన్ గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి చంద్రబాబు మార్క్ పాలన చూపిస్తామని.. సేవకులలో మొదటి సేవకుడిగా పని చేస్తానని వెల్లడించారు.
ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు...
*చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్)
*రాఘవేంద్రరావు (సినీ దర్శకుడు)
*కోళ్ల లలిత కుమారి (ఎమ్మెల్యే విజయనగరం జిల్లా శృంగవరపుకోట)
*పిల్లి అనంతలక్ష్మి (ఎమ్మెల్యే కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా)
*డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొండేపి)
*పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా)
*ఏవీ రమణ (హైదరాబాద్)
*జె.శేఖర్ (తమిళనాడు)
*సుచిత్ర ఎల్లా (తమిళనాడు)
* సంపత్ రవి నారాయణన్ (తమిళనాడు)
*పి.హరిప్రసాద్ (తిరుపతి)
మొత్తం టీటీడీ సభ్యుల జాబితా..
బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్ లతోపాటు అటు తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య కాగా.. తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more