రాజ్యసభలో రాష్ట్ర పునర్విభజన బిల్లు అమోదం పెట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని, కనీసం పదేళ్లైనా పెట్టాలని భీష్మించి.. బిల్లుకు మోకాలడ్డిన బీజేపి.. అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బీజేపీ నేతలలో ముఖ్యంగా వెంకయ్యనాయుడు చేసిన హంగామా నేపథ్యంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్వయంగా రాజ్యసభకు వచ్చి.. ఆంధ్రప్రదేశ్ కు పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారని చెప్పారు. ఆ తదనంతర వచ్చిన సార్వత్రిక ఎన్నికలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమ వల్లే ప్రత్యేక హోదా పదేళ్లకు పెరిగిందని, దానిని అమలు చేయాలంటే తాముకే అధికారాన్ని కట్టబెట్టాలని, బీజేపి సహా దాని మిత్రపక్షం టీడీపీలు ప్రజల్లోకి వెళ్లినందుకే అధికారం దక్కిందని ఆయన గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన ప్రధమ హామీ ప్రత్యేక హోదాను విస్మరించారని, అది సాధ్యంకాదని వెంకయ్యనాయుడు సహా కేంద్రమంత్రులు చెప్పడం, అందుకు రాష్ట్రంలోని అధికార ప్రభుత్వం తాళం కలపడం ప్రజలను మోసం చేయడమేనని బోత్స అన్నారు.
శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం న్యాయ పోరాటం చేస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఒక్కోచోట ఒక్కోలా మాట్లాడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దనడం వెంకయ్యకు సరికాదని ఆయన అన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మానేసి దేశాలు తిరుగుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more