నేపాల్లో భూకంప మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పెరుగుతున్న సంఖ్య స్థానికులను భయాందోళనకు గురిచేస్తుండగా, నేపాల్ లో చోటుచేసుకున్న ప్రకృతి విపత్తు నుంచి స్థానికులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని అక్కడి ప్రభుత్వం ఆర్థిస్తోంది. మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 850కు చేరినట్ుల నేపాల్ హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. అందులో దాదాపు 181 మంది రాజధాని ఖాట్మాండులోనే మృతి చెందారని, మిగతావారు ఫోఖ్రా సహా ఖట్మాండు సరిసర ప్రాంతాలలో మరణించారని అధికారులు వెల్లడించారు. కాగా వారిలో సుమారు 100 మందికి పైగా భారతీయులే వున్నారని కూడా చెప్పారు.
గత 81 ఏళ్లలో నేపాల్లో ఇంటి శక్తివంతమైన ప్రకృతి ఉపద్రవం సంభవించలేదని, ఇదే తొలిసారని కూడా అధికారులు చెబుతున్నారు. ఉదయం 11.56 గంటల సమయంలో 30 సెకన్ల నుంచి రెండు నిమిషాల పాటు మొదటి సారి భూమి కంపించిందని, తరువాత మూడు గంటల వ్యవధిలో 16 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. నేపాల్ అధికారులు ప్రకారం 7,9గా రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత నమోదు కావడంతో నేపాల్ లో ఆస్తి, ఫ్రాణ నష్టం కూడా అంతకంతకూ పెరుగుకుపోతోంది. ఇప్పటికే రాత్రి కావడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగక, ప్రతికూల వాతావరణం కూడా సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రేపటికి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు భావిస్తున్నారు. వేలాది మంది క్షతగ్రాతులలో పలువురి పరిస్థితు కూడా ఆందోళనకరంగానే వుందని అధికారులు చెప్పారు.
కాగా, భూకంపం ప్రభావం ఉత్తర భారతదేశం మీద కూడా తీవ్రంగానే కనిపించింది. బీహార్లో 20 మంది, ఉత్తరప్రదేశ్లో 8 మంది భూకంపం కారణంగా మరణించారు. బీహార్లోఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు గోడకూలి మరణించారు. ఉత్తర బీహార్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు ఇళ్ల గోడలకు బీటలు వారాయి. మరో 48 మంది తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా ముగ్గురు మరణించారు. మాల్డాలోని ఓ స్కూలు భవనం కుప్పకూలి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more