Nepal earthquake: Buildings collapse in Kathmandu after 7.9 magnitude quake in Pokhara, and north eastern india

Strong earthquake kills 110 in nepal 10 in india

earth quake, india, delhi, bihar, gawhathi, Seviour earth quake in nepal people, earthquake, nepal, Dharahara Tower, Bhimsen Tower, disasters-and-accidents, nepal, Buildings collapse in Kathmandu, earthquake rattles Nepal, earthquake rattles Kathmandu, 110 dead in nepal, 10 dead in india

A powerful earthquake has rocked central Nepal, causing extensive damage to buildings and some injuries, eyewitnesses say.

నేపాల్ భూకంపం: ఖట్మాండులో 110, భారత్ లో పది మంది మృతి

Posted: 04/25/2015 03:13 PM IST
Strong earthquake kills 110 in nepal 10 in india

నేపాల్ రాజధాని ఖట్మాండుకు 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమై సంభవించిన భూకంపం నేపాల్, సహా భారత్ ఈశాన్య, ఉత్తర రాష్ట్రలలో ప్రాణ, అస్తి నష్టాన్ని మిగిల్సించింది. నేపాల్ రాజధాని ఖట్మాండు సహా అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ఇప్పటివరకూ అందిన వివరాల ప్రకారం 110 మంది మరణించగా, క్షతగాత్రుల సంఖ్య వేల మందికి పైగానే వుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అనేక ప్రాంతాల్లో శిధిలమైన భవనాల కింద బాధితులు వున్నట్లు సమాచారం.

భూప్రకంపనలతో నేపాల్లోని పురాతన భవనాలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలతో పాటు గృహ సముదాయాలు, కార్యాలయాలు కుప్పకూలాయి. నేపాల్ లాంజంగ్ ప్రాంతంలో భూప్రకంపనలు అధికంగా నమోదు అయ్యాయి. చాలా ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయ్యాయి. మరోవైపు గాయపడినవారు పెద్ద ఎత్తున ఖాట్మాండ్లోని ఆస్పత్రులకు తరలి వస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. పాత ఖాట్మాండ్లోని హన్మాన్ డోక ప్రాంతంలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూ ప్రకంపనల ధాటికి ఖాట్మండు విమానాశ్రయాన్ని మూసివేశారు. దుమ్ముధూళితో ఖాట్మాండ్ నిండిపోయింది. అలాగే నేపాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. టెలికమ్ సేవలు నిలిచిపోయాయి.  నేపాల్ సరిహద్దు రాష్ట్రాల్లో భూకంప ప్రభావం తీవ్రమని అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్ రాజధాని ఖట్మాండు పరిసర ప్రాంతాల్లో ఎటూ చేసినా బీతావహ పరిస్థితులు అలుముకున్నాయి. క్షతగాత్రులను ఓదార్చుతున్న పెద్దలు, తమ వారి కోసం వెతుకుతున్న మరికోందరు. తమ వారు మృతి చెంది ఇంకోందరు అర్తానాధాలు పెడుతుండటంతో విషాధ వాతావరణం అలుముకుంది.

బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో 10 మంది మృతి

ఇటు భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. ఇవాళ సంభవించిన భూప్రకంపనల వల్ల బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మరణించారు. బీహార్లోని భగల్పూర్ గోడ కూలిపోవడంతో ఇకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సీతామాడి, డర్భంగా, వైశాలిలో భవనాలు కూలిపోవడంతో ముగ్గురు  మరణించారు. బీహార్లో చాలా చోట్ల భూప్రకంపనల ధాటికి ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఆస్తి నష్టం ఏమేరకు సంభవించిదన్న విషయం ఇంకా తెలియరాలేదు. యూపీలో భూప్రకంపనల వల్ల ఐదుగురు మరణించినట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు సంభవించగా, ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం లేదు.

భారత ప్రభుత్వం నేపాల్కు సహాయక బృందాలను పంపుతోంది.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఉత్తర,  ఈశాన్య భారతంలో  సంభవించిన భూకంపం ప్రమాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.  భూకంప తీవ్రతపై అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ట్వీట్ చేశారు. నేపాల్లో  భూంకంప పరిస్థితిని  కూడా గమనిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీ, బీహార్, నేపాల్లో సంభవించిన భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ  విపత్తు నివారణ సంస్థను అడిగి వివరాలు తెలుసుకున్నారు. భూకంప తీవ్రతపై అధికారులతో చర్చించారు. భూకంపం ఉత్తర, ఈశాన్య భారతదేశాన్ని వణికించింది. భూప్రకంపనల వల్ల బీహార్లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లో ఐదుగురు మరణించారు. పశ్చమబెంగాల్లో మరొకరు చనిపోయారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : disasters-and-accidents  earthquake  110 dead in nepal  10 dead in india  

Other Articles