చిత్తూర్ జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లో తమిళనాడుకు చెందిన 20 మంది చనిపోయారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా తప్పనిసరి పరిస్థితిలో ఎన్ కౌంటర్ జరపాల్సి వచ్చిందని ఏపి పోలీసులు వెల్లడించారు. కానీ తమిళనాడులో మాత్రం తమ వారిని చంపారంటూ ఆందోళనలు కొనసాగతున్నాయి. అలా తమిళనాడు వ్యాప్తంగా సాగుతున్న నిరసన ఫలితంగా ఏపియస్ ఆర్టీసీకి తీవ్ర నష్టం కలుగుతోంది. ముందే ఆర్టీసీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే చిత్తూర్ ఎన్ కౌంటర్ కారణంగా మరింత నష్టం వాటిల్లుతోంది. గత వారం రోజులు పైగా చిత్తూర్ నుండి తమిళనాడుకు పూర్తిగా రవాణా నిలిచిపోయింది. పైగా తిరుమల తిరుపతి వచ్చే వారు కూడా తగ్గి పోయారు. వచ్చిన వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలా రెండు రాష్ట్రాల మధ్య బస్సులు తిరగడం లేదు. తమిళనాడుకు చెందిన ఆందోళనకారులు ఆంధ్రాకు చెందిన వాహనాలు కనిపిస్తే చాలు దాడులకు దిగుతున్నారు. దాంతో ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది ఎపియస్ఆర్టీసీ. పూర్తి స్థాయి రక్షణ కనిపిస్తేనే బస్సులను కదిలిస్తామని కూడా ఎపియస్ఆర్టీసీ వెల్లడించింది. అయితే అలా ఎన్ కౌంటర్ ఫలితంగా బస్సులు నిలిచిపోయి, 1.80కోట్ల రూపాయల మేర నష్టం కలిగి ఉందని తేలింది. మొత్తానికి ఏపియస్ఆర్టీసీకి ఎన్ కౌంటర్ దెబ్బబాగానే తగిలింది. మరి ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ పరిస్థితి కొనసాగుతుదో.. ఎపియస్ఆర్టీసీకి ఇంకెన్ని నష్టాలు వస్తాయో.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more