భారత ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వారి ఉద్యోగులకు తీపీ కబురును అందించింది. తమ సంస్థ పబ్లిక్ ఇష్యూకు వెళ్లి ఈ ఏడాది ఆగస్టు మాసానికి పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సంస్థలోని ఉద్యోగులకు ఒక్క సారి బోనన్ ను ప్రకటించింది. ఇందుకోసం 2 628 కోట్ల రూపాయలను బోనస్ గా ఇచ్చేందుకు సుముఖం వ్యక్తం చేసింది. దీంతో సంస్థలో ఉద్యోగం చేస్తున్న కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా 2004 ఆగస్టు మాసంలో సంస్థ పబ్లిక్ ఇష్యూలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ.. ప్రస్తుతం భారత్ లో అతిపెద్ద ఐటీ దిగ్గజ సంస్థగా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ అన్ని బ్రాంచీల్లో ఏడాది సర్వీసును పూర్తి చేసుకున్న ప్రతీ ఉద్యోగికి ఈ బోనస్ వర్తించనుంది. అంతేగాక ప్రతి ఉద్యోగికి వారి ప్రతి సంవత్సరంలోని వారం జీవితాన్ని కానుకగా అందిరికీ సమానంగా ఇవ్వనున్నట్లు టీసీఎస్ ప్రకటనలో వెల్లడించింది. అక్టోబర్ - డిసెంబర్ 2014 నాటికి ఈ కంపెనీలో 3.18 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నట్లు టీసీఎస్ సీఈఓ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఆగస్టు 2004న భారతీయ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్డ్ అయిన టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో అత్యంత విలువైన కంపెనీగా ఉంది. ముంబై కేంద్రంగా తమ లావాదేవీలను నడిపిస్తున్న బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన గణంకాలను విడుదల చేసుందుకు ముందు ఉద్యోగులకు ముందుగా శుభవార్తను అందించింది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more