టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులందరికీ ఇక మీదట 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందనున్నది. ఈ మేరకు ఈ-మైడ్ లైఫ్ అనే జాతీయ బీమా కంపెనీ ప్రతినిధులకు టీఆర్ఎస్ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 4కోట్ల 64లక్షల 21వేల 200రూపాయల చెక్కును అంద జేశారు. గత ఫిబ్రవరి 4న టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన సభ్యత్వ నమోదుకు ఏ పార్టీకి రాని స్పందన లభించింది. గతంలో టిడిపి అవలంబించిన జీవిత భీమాను ఇప్పుడు టిఆర్ఎస్ కూడా ఫాలోఅవుతోంది.
పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అన్ని వర్గాల ప్రజానీకం విశేషంగా ఆకర్షితులై నిర్దేశించిన సమ యానికి టీఆర్ఎస్ పార్టీలో సుమారుగా 50లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారు. వీరిలో 41 లక్షల 30 వేల మంది సభ్యులు తమ పూర్తి వివరాలను పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించారు. దీనితో వీరందరికి ప్రమాద బీమా పథకాన్ని వర్తింప చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఈ-మైడ్ లైఫ్ అనే జాతీయ బీమా కంపెనీతో టీఆర్ఎస్ పార్టీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. దీనికి గానూ 4కోట్ల 64 లక్షల 21 వేల 200 రూపాయల చెక్కును సదరు కంపెనీ ప్రతినిధులకు సీఎం కేసీఆర్ అందజేశారు. 50లక్షల సభ్యులకు గానూ ప్రస్తుతానికి 41 లక్షల 30 వేల మందికే బీమా డబ్బులు చెల్లించారు. అయితే, మిగతా సభ్యుల వివరాలను త్వరగా సేకరించి వారికి కూడా ఈ ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపచేయాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more