గుజరాత్ వెళ్తున్నారా.. నరేంద్రమోదీ పుట్టిన ఇల్లు.. వారి పూర్వీకులు నివసించిన ప్రదేశం, మోదీ చిన్నప్పుడు టీ అమ్మిన రైల్వే స్టేషన్ చూడాలను కుంటున్నారా.. మీకు టూరిస్ట్ ప్యాక్ రెడీ.. కేవలం 600 రూపాయలు చెల్లిస్తే.. ఈ ప్రదేశాలు దర్శించవచ్చు. గుజరాత్ ప్రభుత్వ టూరిజం సంస్థ ఈ ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. గుజరాత్ లోని మెహ్సానా జిల్లా వద్ నగర్ లో 1950లో మోదీ జన్మించారు. ఆ గ్రామం, మోదీ పూర్వీకుల ఇల్లు, రైల్వేస్టేషన్ లను టూరిజం కార్పొరేషన్ అఫ్ గుజరాత్ లిమిటెడ్ దర్శనీయస్థలాలుగా చేసింది. మోదీ అంటే క్రేజ్ ఉన్న గుజరాత్ లో ఈ ప్యాకేజీ సూపర్ హిట్ అయిందట. జనవరిలో అహ్మదాబాద్ లో జరిగిన వైబ్రాంట్ గుజరాత్ సభ సందర్భంగా ప్రవేశపెట్టిన వెబ్ సైట్ ద్వారా ఈ టూర్ ను ప్రమోట్ చేస్తున్నారు.
అహ్మదాబాద్, గాంధీనగర్ నుంచి టూర్ మొదలవుతుంది. వద్ నగర్ లో మొదట మోదీ జన్మించిన, వారి పూర్వీకుల ఇల్లు, మోదీ చదువుకున్న ప్రాథమిక పాఠశాల – ‘వద్ నగర్ ప్రాథమిక్ కుమార్ శాలా’ కు తీసుకువెళ్తారు. మోదీ చిన్నప్పుడు చదువుకుంటూనే నాటకాలు వేసిన వద్ నగర్ లోని హైస్కూల్ ను కూడా చూపిస్తారు. తర్వాత ప్రసిద్ధ హట్ కేశ్వర్ దేవాలయం సందర్శన. ఈ శివాలయంలోనే మోదీ భజనల సందర్భంగా తబ్లా వాయించేవారట. టూరిస్ట్ లు కోరిన పక్షంలో మోదీ చిన్ననాటి స్నేహితులతో కూడా మాట్లాడే అవకాశం కల్పిస్తారు. తర్వాత వద్ నగర్ రైల్వే స్టేషన్ సందర్శన. నేటి ప్రధాని ..ఒకప్పటి చాయ్ వాలా.. టీ అమ్మిన స్థలం ఇది. తన జీవితంలో ఈ ప్రదేశాన్ని ఎన్నడూ మరచిపోలేనని ప్రధాని మోదీ పదేపదే చెప్పేస్థలం ఇది. వద్ నగర్ లో ప్రాచీన బౌద్ధ ఆరామాలు, శర్మిష్ట సరస్సులను కూడా చివర్లో టూరిస్ట్ లు సందర్శించవచ్చు. శర్మిష్ట సరస్సులోనే మోదీ చిన్నప్పుడు సాహసించి మొసలిని పట్టుకున్నారని చెబుతారు. మొత్తానికి ప్రధాని మోదీ గురించి టూరిస్టులకు తెలిసి వచ్చేలా ప్రత్యేక ప్యాకేజీలను కూడా సిద్దం చేశారు. అలా మోదీ జీవిత చరిత్రను కొత్తగా ప్రమోట్ చేస్తున్నారని కొందరు అప్పుడే విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more