20 red sandalwood smugglers killed in police encounter

Encounter in chitoor district

encounter in chitoor district, 20 red sandalwood smugglers killed encounter in chandragiri, tamilnadu smugglers killed in encounter, Ap police and forest department joint operation,, encounter in andhra pradesh, Red sandal wood smugglers killed in encounter

20 red sandalwood smugglers were killed in police encounter in chitoor

శేషాచలం అడవుల్లో భారీ ఎన్ కౌంటర్.. 20 మంది మృతి

Posted: 04/07/2015 10:07 AM IST
Encounter in chitoor district

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ప్రశాంతంగా వుండే అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకుల మోతలు మార్ర్మోగాయి. అడవి బిడ్డలతో పాటు మూగ జీవాలు కూడా తుపాకుల మోతలకు భీతిల్లాయి. చంద్రగిరి మండలం ఈతగుంట, ఈగితీగలకొన పరిసర ప్రాంతాలలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైయ్యారు. చంద్రగిరి మండలం ఈటపాక అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసకుంది. మంగళవారం ఈతగుంట, ఈగితీగలకొన ప్రాంతాలలో తమిళనాడు నుంచి వచ్చిన  ఎర్రచందన స్మగ్లర్లు దాగి ఉన్నారని ప్రత్యేక పోలీసు దళానికి సమాచారం అందింది.

ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా  పరిసర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు... పోలీసులపైకి రాళ్ల దాడికి దిగారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు హతమైయ్యారు. పోలీసుల కాల్పులతో పలువురు స్మగ్లర్లు పరారైయ్యారు. స్మగర్లను పట్టుకునేందుకు పోలీసులు, అటవీశాఖ అధికారులు జాయింట్ అపరేషన్ నిర్వహిస్తూ చంద్రగిరి పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : encounter  chitoor district  20 red sandalwood smugglers killed  

Other Articles