ఎన్డీయే మిత్రపక్ష కోటా కింద తెలుగుదేశం పార్టీకి గవర్నర్ పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ కోరనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీతో దీనిపై మాట్లాడే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు వినతికి కేంద్రం అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు ఆ అవకాశం దక్కే అవకాశం ఉంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు మోత్కుపల్లికి ఈ మేరకు చంద్రబాబు హామీ ఇచ్చారు. దానిని నెరవేర్చుకోవడానికి ఆయన కొంత కాలంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పోస్టు సాధించడానికి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, టీడీపీకి ఒక గవర్నర్ పోస్టు ఇవ్వడానికి బీజేపీ నాయకత్వం కూడా సుముఖంగానే ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఎవరైనా నిపుణుల పేర్లను ఇవ్వాలని ఆ పార్టీ సూచిస్తూ వస్తోంది. కానీ అందుకు టీడీపీ నాయకత్వం ఒప్పుకోవడం లేదు. తమ పార్టీకి చెందిన దళిత నేత, మాజీ మంత్రికే ఆ అవకాశం ఇస్తామని, ఆయనకే ఇవ్వాలని కోరుతోంది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలను ఉత్సాహపర్చడానికి వారిలో కొందరికి కేంద్రంలో నామినేటెడ్ పదవులు ఇప్పించాలని పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఒక గవర్నర్ పదవితోపాటు కేంద్రంలో కొన్ని నామినేటెడ్ పదవులు కూడా తమకు ఇవ్వాలని ఆయన ప్రధానిని కోరే అవకాశం ఉంది. టీడీపీ కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కాగా, ఏపీలోని టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్లోని నామినేటెడ్ పదవుల్లో కొన్ని తమకు కావాలని టీడీపీ వద్ద బీజేపీ ప్రతిపాదనలు పెడుతోంది. ఎమ్మెల్సీ పదవులు కూడా రెండు కావాలని కోరింది. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, కార్పొరేషన్ పదవుల్లోనూ తమకు కొంత భాగం ఇవ్వాలని కోరుతోంది. ఏపీలో బీజేపీకి నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు కేంద్రంలో కూడా తాము కొన్ని పదవులు తీసుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more