కెన్యాలో సాయుధ ముష్కరులు మారణహోమం సృష్టించారు. ఈశాన్య కెన్యాలోని గరిస్సా యూనివర్సిటీపై సాయుధ ఉగ్రవాదులు.. వేకువ జామున ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా, సుమారుగా 60 మంది క్షతగాత్రులయ్యారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా వుంది. వీరిలో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్ధులు, యూనివర్సిటీ సిబ్బంది గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొదట యూనివర్సిటీ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు గేట్ వద్ద ఉన్న ఇద్దరు గార్డులను కాల్చి వేశారు. ఆ తర్వాత యూనివర్సిటీలోని హాస్టల్స్లోకి అప్పటికీ ఇంకా నిద్రావస్థలో వున్న విద్యార్ధులపై బులెట్ల వర్షం కురిపించారు.
ఉదయం 5.30లకు ఉగ్రవాదులు యూనివర్సిటీలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. యూనివర్సిటీలో మొత్తం 887 మంది విద్యార్ధులు ఉన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న విషయం తెలుసుకున్న కెన్యా భద్రతా దళాలు యూనివర్సిటీని చుట్టిముట్టాయి. యూనివర్సిటీలోని కొంత మంది విద్యార్ధులు ఉగ్రవాదులు చేతిలో బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో జరుగుతున్న కాల్పుల ఘటనకు సంబంధించి సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్ధ అల్ షబబ్ తామే బాధ్యులమంటూ ప్రకటించింది.
2013లో కూడా కెన్యా రాజధాని నైరోబీలో ఓ షాపింగ్ మాల్పై జరిగిన దాడిలో ఈ ఉగ్రవాదులే మారణకాండ సృష్టించారు. ఆల్ ఖైదా మద్దతుతో సోమాలియాకు చెందిన ఈ అల్ షబబ్ ఉగ్రవాద సంస్ధ కెన్యాలో అరాచకాలను సృష్టిస్తోంది. కెన్యాకు చెందిన ఉత్తర భాగం సోమాలియాకు అతి సమీపాన ఉండటంతో ఈ సంస్ధ దాడులకు పాల్పడుతుంది. గత నెలలో సోమాలియాకు సరిహద్దులో ఉన్న మండేరాలో దాడులకు పాల్పడి 12 మంది అతి కిరాతకంగా చంపారు. 2012 నుంచి 2014 వరకు అల్ షబబ్ ఉగ్రవాద సంస్ధ చేసిన దాడుల్లో సుమారు 312 మంది మరిణించినట్లు కెన్యా దేశపు గణాంకాలు తెలుపుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more