వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా ఆసీస్ కెప్టెన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ముందుగా బౌలింగ్ చేయాల్సిరావడంతో తాము కంగారు పడడం లేదని టీమిండియా కెప్టెన్ ధోని తెలిపారు. టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ తీసుకునే వాళ్లమని కూడా ధోనీ వెల్లడించాడు. తమ టీమ్ లో ఎటువంటి మార్పులు లేవని తెలిపాడు.
ఆస్ట్రేలియాకు ఇప్పటి దాకా నాలుగు వరల్డ్ కప్ లు గెలిచిన అనుభవం ఉంటే, భారత్ కు రెండు సార్లు వరల్డ్ కప్ ను గెలిచిన అనుభవం ఉంది. అయితే ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియాలు తొమ్మిదిసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరాయి. ఏడు మ్యాచ్లలో ఏడు విజయాలు, ప్రతీ సారి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేస్తూ టీమిండియా ప్రపంచ కప్ లో దైసుకెలుతోంది. అయితే ఇదే ఫైనల్స్ అన్నట్లుగా రెండు జట్టు ఎంతో కీలకంగా ఈ మ్యాచ్ ను భావిస్తున్నాయి. ఎంతో కీలకమైన ఈ మ్యాచ్ లో రెండు జట్లలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. బ్యాటింగ్ ఆర్డర్ లోనూ రెండు టీంలు మార్పులు చోటు చేసుకోలేదు.
భారత్ ఇప్పటి వరకు ఆడిన ఆటంతా వేరు, కానీ ఈ ఒక్క మ్యాచ్లో ఆడాల్సిన ఆట వేరు. పాక్ను కొట్టినంత సులభంగా ఆసీస్ను ఓడించడం భారత్ అంత సులభం కాదు. టీమిండియా గత చరిత్ర, లెక్కలు ప్రతికూలంనే ఉన్నాయి. అయితే టీమిండియా ప్రస్తుతం ఫామ్ లో ఉండటం, పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అయితే బారత్ టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కు దిగి ఉంటే బాగుంటుందని అందరు అనుకున్నారు. కానీ టాస్ ఆస్ట్రేలియా గెలిచింది. అయితే మ్యాచ్ మనం గెలుస్తాం అన్న ధీమా టీమిండియా అభిమానుల్లో ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more