ఆ మధ్య ఎంపీల జీతాలు పెంచాలని ప్రతిపాదిస్తు సహచర ఎంపీలు చేసిన తీర్మానాన్ని క్షణాల మీద బిల్లుగా మార్చి భారత పార్లమెంట్ ఘటనతను చాటారు మన నేతలు. అలా ప్రజలు కావాలని వాటి గురించి మాట్లాడటానికి రోజులు, వారాలు కుదిరితే సంవత్సరాల కాలం పాటు సాగదీసే మన నేతాగణం వారి అవసరాలకు తగ్గట్టుగా మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎంపీల జీతాలను పెంచాలని, నియోజకవర్గానికి ఇచ్చే ఫండ్ ను పెంచాలన్న నిర్ణయాలపై ఎలాంటి చర్చ కూడా లేకుండా వెంటనే బిల్లు ఆమోదం పొందుతుంది ఎందుకంటే ఇది ఇండియా. అయితే అసలే హైటెక్ బాబుగా పేరుతెచ్చుకున్న బాబు చంద్రబాబు. ఏపి ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉంది అని మీడియా ముందు మాట్లాడే ఆయన, తాజా నిర్ణయంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి అసలే నిధుల కొరత ఉంది అని అందరూ బాధపడుతుంటే చంద్రబాబు మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా ఖర్చులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరికీ రాష్ట్ర ప్రభుత్వం కానుకలు ఇవ్వనుంది. కానుకలంటే అలాంటి ఇలాంటి కానుకలు కాదు, ఈ మధ్యే మార్కెట్లో హల్చల్ చేస్తున్న యాపిల్ ఐఫోన్6 లను ఎమ్మెల్యేలకు కానుకగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానుకుగా ఇవ్వనున్న ఒక్కో ఐఫోన్ ధర సుమారు 50 వేలు. రాష్ట్రం ఆర్థికపరంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, ఆర్థిక పురోగతి సాధించాల్సిన అవసరం ఉందనీ.. ఓ వైపు ఊదరగొడుతున్న చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇంత విలువైన కానుకలు ఇవ్వాల్సిన అవసరం ఏంటని పలువురు వాపోతున్నారు. అయితే ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఏకంగా ఐఫోన్ లు ఇస్తున్నారంటే వారిని బాగా వాడుకుంటారని కూడా మరో వాదన ఉంది. ఏది ఏమైనా ఏపి ఎమ్మెల్యేలకు మాత్రం ఇది సంతోషం కలిగించే వార్తే.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more