యుపిఎ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అవతవకలపై ఈడీ విచారణ స్పీడ్ పెంచింది. ఈ కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నోటీసులు పంపి దేశంలో సంచనానికి తెర తీసింది. అయితే మన్మోహన్ కు బాసటగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ ఇంటి వరకు సంఘీబావంగా ర్యాలీని నిర్వహించింది. అయితే తాజాగా బొగ్గు కుంభకోణంలో మరో కీలక నిందితుడిగా అనుకుంటున్న దాసరి నారాయణరావునూ ఈడి టార్గెట్ గా చేసింది. కొన్ని కార్పోరేట్ వర్గాలకు మేలు చేసేలా దాసరి నారాయణరావు, తప్పుడు సమాచారాన్ని ప్రధానికి నవేదించినట్లు సమాచారం.
కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్మెంట్కు ఈడీ రంగం సిద్ధం చేసింది. బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. దాసరి బొగ్గుగునుల శాఖ సహాయమంత్రిగా ఉన్నప్పుడు జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీకి లబ్ది చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని, జిందాల్ కంపెనీ నుంచి దాసరికి చెందిన సౌభాగ్య మీడియా కంపెనీకి రూ.2.25 కోట్లు క్విడ్ ప్రోకో రూపంలో అందాయని సీబీఐ నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు దాసరిని ఈడీ, సీబీఐ విచారించింది. సౌభాగ్య మీడియా కంపెనీ ఆస్తులను ఈడీ జప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికి ఆస్తుల అటాచ్మెంట్కు సంబంధించిన ప్రకటనను ఈడీ వెలువరించే అవకాశం ఉంది. జార్ఖండ్లో జిందాల్ కంపెనీకి బొగ్గు గనుల కేటాయింపుల్లో దాసరి నారాయణరావు పాత్రమై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేసింది. దాసరికి ముడుపులు అందినట్లుగా చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more