ఎమ్మెల్సీ ఎన్నికలపై టిఆర్ఎస్, బిజెపి పార్టీల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది. మొదటి నుంచీ పక్కా ప్రణాళికతో ఉండడం, పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించడంతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థుల కంటే తమ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారని, రెండు స్థానాల్లోనూ గెలుపు ఖాయమని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలపై టీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం కాస్త నిరాశ ఆవహించింది. క్షేత్రస్థాయి ప్రతికూల పరిస్థితులతో రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు ఎదురీదినా.. చివరికి గట్టెక్కవచ్చనే ఆశాభావాన్ని ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎంపికతో ఆ పార్టీ నేతల్లో నైరాశ్యం నెలకొందని, ఇది ఫలితాల్లోనూ ప్రభావం చూపనుందని వివరిస్తున్నారు.
రెండు చోట్లా ప్రధాన పోటీ టీఆర్ఎస్ -బీజేపీ మధ్యనే నెలకొంది. హైదరాబాద్ నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో పోలింగ్ జరగకపోవడంతో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్లో 27 శాతం, రంగారెడ్డిలో 37 శాతం, మహబూబ్నగర్లో 53 శాతం నమోదైంది. అయితే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపైనే టీఆర్ఎస్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువ నమోదు కావడమే కాకుండా, బీజేపీకి కాస్త అనుకూలంగా ఉండే మహబూబ్నగర్లో ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. పోలింగ్ రోజే ఒక్కో ఓటరుకు బీజేపీ నేతల నుంచి నాలుగైదు ఫోన్ కాల్స్ వెళ్లాయి. పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. అయితే, టీఆర్ఎస్ ఎలాంటి ఎక్సర్ సైజ్ చెయ్యకపోవడంతో అది టిఆర్ఎస్ పార్టీ పై ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు. రామచంద్రరావు బార్ కౌన్సిల్, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కావడంతో న్యాయవాదులు, జర్నలిస్టులతోపాటు ఉస్మానియా, పాలమూరు వర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు రామచందర్ రావుపై మొగ్గు చూపారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి గెలుస్తుందని పార్టీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే ఫలితాల విడుదల కోసం అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఎదురు చూస్తున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more