కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి 1.10 కోటి రూపాయల మోసం చేసినట్టు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. . రేణుకా చౌదరిపై రాంజీ అనే స్థానిక నేత భార్య భూక్యా కళావతి అనే ఆమె కేసు పెట్టగా, ఖమ్మం జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. గత ఎన్నికలలో తన భర్త రాంజీకి ఖమ్మం జిల్లాలో వైరా అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. రేణుకా చౌదరి తన భర్త వద్ద నుండి రూ.1.10 కోట్లు పుచ్చుకొన్నారని ఆమె ఆరోపించారు. రేణుకా చౌదరి తన భర్తకు ఆమె టికెట్ ఇప్పించకపోవడంతో ఆయన తీవ్ర మానసికవేదన అనుభవించి చనిపోయారని తెలిపారు.
చివరకు భూక్యా కళావతి హైకోర్టులో పిటిషను వేశారు. దానిపై స్పందించిన హైకోర్టు తక్షణమే రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారించమని పోలీసులను ఆదేశించడంతో వారు రేణుకా చౌదరిపై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఆ తరువాత ఆమెను తమ డబ్బు వాపసు చేయమని ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకపోగా, ఆమె తనను కులం పేరుతో దూషించారని, తాను ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు పిర్యాదు చేసినా వారూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన రేణుకా చౌదరి తనెన్నడూ ఆమెను కానీ, ఆమె భర్తని గానీ కనీసం చూడలేదని రేణుక చౌదరి తెలిపారు. మరి ఈ విషయంలో క్లారిటీ రావాలంటే పోలీసులు విచారణను పారదర్శకంగా చెయ్యాలి. మరి అది జరుగుతుందో లే్క అవినీతికి పోలీసులు లొంగుతారో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more