విల్లింగ్ టన్ లో జరుగుతున్న న్యుజిలాండ్, వెస్టిండీస్ మ్యాచ్ లో న్యుజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ అజేయ డబుల్ సెంచరీతో సునామీ ఇన్నింగ్స్ ఆడడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. విండీస్ కు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గుప్టిల్ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. విండీస్ బౌలర్లను ఎడాపెడా బాదుతూ కెరీర్ లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.మెక్ కల్లమ్ 12, స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా గుప్టిల్ అనూహ్యంగా చెలరేగడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. గుప్టిల్ 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేశాడు. రోంచీ 9, ఇలియట్ 27, ఆండర్సన్ 15, రాస్ టేలర్ 41, విలియమ్సన్ 33, మెక్ కల్లమ్ 12 పరుగులు చేసి అవుటయ్యారు. విండీస్ బౌలర్లలో టేలర్ 3, రసెల్ 2, వికెట్లు పడగొట్టారు.
వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్ లో మార్టిన్ గుప్టిల్ డబుల్ సెంచరీ చేయడమే కాకుండా అత్యధిక పరుగుల రికార్డును సృష్టించాడు. ఇదే వరల్డ్ కప్ లో క్రిస్ గేల్- 215 నమోదు చేసిన రికార్డును మార్టిన్ గుప్టిల్అధిగమించాడు. అంతకుముందు 152 బంతుల్లో 21 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ మార్కును దాటిన మార్టిన్ గుప్టిల్ ఆ తరువాత గేల్ రికార్డును కూడా అధిగమించాడు. మార్టిన్ గుప్టిల్ (237 నాటౌట్; 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లు) వీర విహారం చేసి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ప్రపంచకప్ లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందగా, వన్డేల్లో న్యూజిలాండ్ తరుపున డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్ మెన్.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more