ఏ రాష్ట్ర చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా ప్రజాప్రతినిధులే.. అయినా.. తప్పవు విమర్శలు, నిరసనలు అన్నట్లు.. దేశంలోని ప్రతి చోట అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కారణంగా వాదనలు, దూషణలు, మరికోన్ని చోట్ల అడుగు ముందుకేసి దౌర్జన్యాలు. వాళ్లంతా ప్రజల ఓట్లతో చట్టసభలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులే.. కానీ ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు, అధికారంతో పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరు సగటు మనిషిని ఆలోచింపజేస్తుంది.
అన్ని చోట్ల ఎలావున్నా.. దేవుడి సోంత రాష్ట్రంగా, ప్రకృతి పరవళ్లు తొక్కుతున్న కేరళలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇవాళ బడ్జెట్ సందర్భంగా కేరళ అసెంబ్లీ ఎదుట విఫక్ష ఎల్ డీ ఎఫ్ కు చెందిన కార్యకర్తలు, యువమోర్చా సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆర్థిక మంత్రి కె ఎం మణి చేత బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నవారు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి చేరుకుని నిరసనకు దిగారు. ప్రతిపక్షాల వ్యూహాన్ని కనిపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి మణి మార్షల్స్ పహరా నడుమ బడ్జెట్ ప్రసంగాన్ని చదివి మమ అనిపించారు.
కాగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం సాగినంత సేపు అసభ్య దృశ్యాలు కనిపించాయి. స్పీకర్ చైర్ పైనా విపక్ష సభ్యులు తమ ప్రతాపాన్ని చూపారు. కొద్ది సేపు చైర్ అటుఇటు ఊపారు. అది చాలదన్నట్లు పలువురు ప్రతిపక్ష సభ్యలు మైకులు విసిరారు. ఈ ఘటనలను చూసి ఓ శాసనసభ్యడు అసెంబ్లీ జరుగుతుండగానే సృహ కోల్పోయాడు. ఇన్ని నిరసనలు, ఆందోళనలు కోనసాగుతున్నా ఆర్థిక మంత్రి మాత్రం తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. అసెంబ్లీలోని శాసనసభ్యులను వెళ్లనీయకుండా యువమోర్చా కార్యకర్తలు, ఎల్డీఎఫ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్పీకర్ సాకేతన్ ను కూడా అనుమతించలేదు. దీంతో అసెంబ్లో ఆవరణలోనే ముందగా ఆందోళనకు దారి తీసింది. పలువరు ఎల్డీఎప్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద కూర్చోని ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
ఇదంతా చూసిన ప్రజలు అసెంబ్లీకి వెళ్లిన శాసనసభ్యులు ఏం చేస్తున్నారు..? బడ్జెట్ లో తమకు చేకూరుతున్న లబ్ది ఏంటి అన్న విషయాలను మర్చి.. ఔరా.. వీళ్లకేనా మనం భారీ క్యూ లో నిలబడి ఓట్ల వేసి గెలిపించిందని. అనుకునే స్థాయికి చేరింది. అయితే ఈ పరిస్థితిని మార్చడం ఎప్పటికి సాధ్యపడుతుందో కానీ.. నిరసనకారులు కూడా శృతిమించకుండా చర్యలు తీసుకోవడంలో అక్కడి ప్రభుత్వం కూడా విఫలం చెందింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more