జస్టిస్ మార్కండేయ ఖట్జూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతదేశానికి హాని చేసిన జాతిపిత మహత్మా గాంధీ- ఓ బ్రిటిష్ ఏజెంట్" అంటూ తన బ్లాగ్ లో ఓ ఆర్టికల్ రాసి, పోస్ట్ చేశారు. అసలు గాంధీని తాను ఎందుకు అలా అనవలసి వచ్చిందో తన ఆర్టికల్ లో వివరించారు. మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ బ్రిటీష్ వారు పాటించిన విభజించు పాలించు అనే సిద్దాంతాన్ని పాటించారని అన్నారు. అలాగే గాంధీ మతతత్వం కనిపించేలా, ఉద్యమాన్ని మలుచుకున్నారని అన్నారు. హిందుత్వ భావాలు ఉట్టి పడే పేర్లను తన ఉద్యమంలో వాడుకున్నారని తెలిపారు. అయితే మార్కండేయ ఖట్జూ రాసిన వ్యాసం తీవ్ర సంచలనం రేపింది. సర్వత్రా నిరసర వెల్లువ కొనసాగుతోంది. అయితే కొందరు మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు.
భారతదేశంలో అద్భుతమైన వైవిధ్యం ఉందని, కులాలు, మతాలు, జాతులు, భాషలు ఉన్నాయని చెప్పారు. విభజించు పాలించు అనేది బ్రిటిష్ విధానం అందరికీ తెలుసునని, తర్వాత కాలంలో అదే బ్రిటిష్ విధానాన్ని మహాత్మా గాంధీ మరింతగా విస్తరించారని ఆరోపించారు. 'వాట్ ఈజ్ ఇండియా' పేరుతో రాసిన ఓ అర్టికల్లో గాంధీజీపై కట్జూ తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు చేశారు. "ఇలా అనడం వల్ల నాపై వ్యక్తిగత దూషణలు వస్తాయని నాకు తెలుసు. కానీ ప్రజాదరణ ఆశించని ఓ వ్యక్తిని కాదు కాబట్టి పెద్ద విషయం కాదు. అని వివరించారు.
ఇలాంటి వాటి వల్ల మొదట్లో నన్ను అప్రజాదరణకు గురిచేస్తాయి. దాంతో నేను అవమానాలు పడాల్సి ఉంటుంది, పలువురు నా వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేస్తారు. నా దేశం ఆసక్తి మేరకు కొన్ని విషయాలు చెబుతున్నాను" అని కట్జూ ముందుగానే పేర్కొన్నారు. మొత్తానికి ఆర్టికల్ తరువాత వచ్చే పలు విమర్శలను కూడా ఖట్జూ ముందే ప్రస్తావించారు. అయితే వెంటనే బ్లాగ్ ను నిలిపివెయ్యాలని గాంధేయవాదులు కోరుతున్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more