తెలంగాణ అసెబ్లీలొ తెలుగుదేశం పార్టీ తరఫున తెరాసపై మాటల దాడికి దిగిన టిడిపి నేత రేవంత్ రెడ్డి, తాజాగా మరో సారి కెసిఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక నమస్తే తెలంగాణ పేపర్ చెల్లని కాగితం అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను మైక్ పట్టుకుంటే తెరాస నేతలు వణుకుతున్నారని అన్నారు. సాక్షాత్తు మంత్రికి కూడా తెలియకుండా చెక్పోస్టులు ఎత్తివేసినందుకు మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ ఓ మిషన్ కరెప్షన్ అన్నారు. అక్రమాలు బయటపెడతారనే జర్నలిస్టులపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఎర్రగడ్డ ఛెస్ట్ ఆసుపత్రిని తొలగించి, అక్కడకు సచివాలయాన్ని తరలించాలన్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు.
రైల్వే బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి బీజేపీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులను సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారన్నారు. ఇక తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వస్తున్న ఆరోపణల గురించి కూడా విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పొన్న ప్రభాకర్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజాలు తేలాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని వెల్లడించారు. తెలుగుదేశం హయాంలో నక్సల్స్ చాలా ఇబ్బంది పెట్టేవారని, అప్పుడు వారు లేకుంటే బాగుండు అనిపించేదని అన్నారు. కానీ ఇప్పుడు కేసిఆర్ పాలన చూస్తుంటే వాళ్లుంటే బాగుండనిపిస్తోందని, వారే కెసిఆర్ కు తగిన పాఠం చెప్పే వారని రేవంత్ అన్నారు.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more