రేణుక షాపింగ్ చేస్తోంది.. విమనాం ఆగింది అన్నటైటిల్ చూడగానే మదిలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి కదూ.. విమానం ఒక ప్రయాణికురాలి కోసం ఆగిందంటే చిత్రమే మరి, అయితే ఈ ప్రయాణికురాలు మరెవరో కాదు మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి. మరి అమె కోసం విమానం ఆగడంలో తప్పులేదు కదూ.. అనుకుంటున్నారా..? ప్రస్తుతం అధికారంలో వున్న కేంద్ర మంత్రితో పాటు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి కూడా అసీనులై వున్న విమానం.. కేంద్ర మాజీ మంత్రి కోసం ఆగడంలో తప్పే కదు. సరిగ్గా ఇదే విషయమై పౌరవిమానయాన శాఖ ఇప్పడు విచారణ చేపట్టింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఎయిరిండియా ఆలస్య ఘటన వివరాలు ఇలా వున్నాయి.
కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి గత శుక్రవారం రోజున ఎయిర్ ఇండియా చికాగో-ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే సమాయానికి విమానాశ్రయం చేరుకున్న రేణుకా.. తన లగేజి విమానంలో పెట్టించిన తరువాత షాఫింగ్కు వెళ్లారు. విమానం షెడ్యూల్డు సమయానికి ముందు చేరుకోవాల్సిన రేణుకా చౌదరి పలుమార్లు అనౌన్స్ మెంట్ చేసినా విమానంలోకి చేరుకోలేదు. సదరు విమానం 7 గంటలా 4 నిమిషాల లోపు విమానాశ్రయం నుంచి టేకాఫ్ కావాలి. రేణుకాచౌదరి రాక ఆలస్యం కావడంతో విమానం ఆ సమయానికి టేకాఫ్ తీసుకోలేదు. ఫలితంగా సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరి వెళ్లాల్సిన విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ విషయమై విమానయాన ప్రయాణికుల అధికారులను నిలదీశారు.
కాగా తాను షాపింగ్ చేయడం వల్లే ఎయిర్ ఇండియా విమానం ఆలస్యమైందన్న వార్తలను రేణుకా చౌదరి ఖండించారు. తాను షాపింగ్ ఎక్కడ చేశానో అరోఫణలు చేసే వాళ్లు చూపించగలరా అని ప్రశ్నించారు. విమానాశ్రయం నుంచి విమానం వద్దకు వచ్చేందుకు తీసుకు వచ్చే బస్సు ఆలస్యం అయినందునే తన లేట్కు కారణమంటూ రేణుక చౌదరి చెప్పారు. దీంతో ఆ ఆలస్య ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణ అదేశించింది. మరోమారు ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ఎయిర్ ఇండియా ఎలక్ట్రానిక్ బ్యాగేజి గుర్తింపు విధానాన్ని అమలు చేసుకోవాలని పౌర విమానయాన శాఖ అధికారులు అదేశించినట్లు సమాచారం.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more