ప్రపంచకప్ క్రికెట్ టార్నమెంట్ లో భాగంగా అస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన మ్యాచ్ లో సపారీలను.. టీమిండియా చిత్తు చేసింది. ప్రపంచ కప్ లో ఇప్పటివరకు భారత్ పై ఓటమి ఎరుగని సౌత్ ఆఫ్రికాలకు ధోణి సేన ఓటమిని రుచి చూపించి రికార్డులను తిరగరాసింది. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ సఫారీలపై శివమెత్తి ప్రత్యర్థి బౌలర్లను మట్టికరిపించాడు. ధావన్ సెంచరీ చేసిన ప్రతీ మ్యాచ్ లోనూ టీమిండియాను విజయం వరించింది. అదే అనవాయితీ ఇవాళ కూడా కోనసాగింది.
డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన ధోణిసేన అంచనాలను మించి రాణిస్తూ ఆల్ రౌండ్ షోతో అదరగొడుతోంది. టీమిండియా బౌలింగ్ అంత పటిష్టంగా లేదని విమర్శలు ఎదుర్కోంటున్న సమయంలో సఫారీలను చిత్త చేసి తమ సత్తాను చాటారు. ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో ధోనీసేన 130 పరుగులతో సఫారీలను చిత్తుగా ఓడించారు. ధవన్ సూపర్ సెంచరీకి తోడు బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్నందించారు.
308 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సఫారీలు 40.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటయ్యారు. అశ్విన్ మూడు, మోహిత్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో డుప్లెసిస్ (55) టాప్ స్కోరర్. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ చెల్లాచెదురైంది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ధోనీసేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 307పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ధావన్ (146 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 137) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా.. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు. వన్డేల్లో ధావన్కిది ఏడో సెంచరీ కాగా, సఫారీలపై రెండోది. మరో యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించాడు. మోర్కెల్ రెండు వికెట్లు తీశాడు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more