కాలం చెల్లిందనుకుంటున్న సమయంలో ప్రధాని నరేంద్రమోడీ సరికోత్త ఆలోచన దానికి ప్రాణం పోసింది. జీవాన్ని పూరించింది. మళ్లీ పూర్వ వైభవం దిశగా ముందుకు సాగింది. ఏంటది అనుకుంటున్నారా..? అదే ఆకాశవాణి.. రేడియో. కేబుల్ టీవీల ఆగమనంతో రేడియోలను, ట్రాసిస్టర్లను పక్కన బెట్టారు. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కడంతో మళ్లీ పుంజుకున్న రేడీయోను.. స్మార్ట్ ఫోన్లు, పోన్లలో తమకు ఇష్టమైన పాటలను డౌన్ లోడ్ చేసుకుని నిల్వ చేసుకోవడంతో మళ్లీ రేడియోకు వచ్చినట్లే వచ్చిన మహర్ధశ చేజారింది. అయితే ఇప్పటికే ఇంకా గ్రామీణ భారతంలో రేడియో తన ఆధిపత్యాన్ని చాటుతున్నా.. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో మాత్రం అంతంతమాత్రంగానే వుంది.
దేశ ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రజలతో నేరుగా మాట్లాడాలని సంకల్పించారు. ఈ క్రమంలో గ్రామీణ భారతావణితో ముడివేసుకున్న రేడియోను సాధనంగా వినియోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రతి నెల ముందుగా నిర్ణయించే ఆదివారం రోజున తన మస్సులోని మాటలను ఆయన దేశ ప్రజలతో పంచుకుంటారు. అ కార్యక్రమమే ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమం. ఈ తరుణంలో జట్కా బండిలా నడుస్తున్న ఆకాశవాణి, అదేనండి అల్ ఇండియా రేడీయోను ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. అదెలా అంటారా..?
ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ భాత్ ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోకు అత్యధికంగా ధనాన్ని ఆర్జించే వనరుగా మారింది ఫిబ్రవరి మాసంలో ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతున్నాయి. దీనిని వాణిజ్యంగా మర్చుకున్న ఆల్ ఇండియా రేడియో .. వివిధ వాణిజ్య ప్రకటనలను తీసుకుని ఇప్పటికే సుమారు 25 లక్షల రూపాయలను ఆర్జించింది. పది సెకన్ల నిడివి గల వాణిజ్య ప్రకటన కోసం పలు సంస్థలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఒక పదినిమిషాల స్లాట్ కోసం సుమారు రెండు లక్షల రూపాయలను కూడా కంపెనీలు వెచ్చిస్తున్నాయి. దటీజ్ నరేంద్ర మోడీ..!
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more