తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శాసనసభలో ప్రాతినిధ్యం లేని ఇద్దరు మంత్రులు సుముఖత చూపడం లేదు. తెలంగాణలో అధికారిక పార్టీలో వుంటూ తాము ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసి నెగ్గడంపై భావ్యం కాదని, నేరుగా ప్రజలందరి ఓట్లతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టాలని వరు కుతూహలపడుతున్నారు. తెలంగాణ విద్యాశాఖ కడియం శ్రీహరి, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.
మరోవైపు తాము సేఫ్ జోన్ ద్వారా మండలిలో అడుగు పెట్టాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్లమెంటు సభ్యుడి కోసం అహర్నిశలు కష్టపడిన తనకు ఈ సారైనా కొంత రెస్టు అవసరమని కడియం శ్రీహరి భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే తాను గత ఎన్నికలలో కొంత నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని తుమ్మల నాగేశ్వర రావు కూడా ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరు మంత్రులు పట్టబద్రుల ఎన్నికల కోటాలో ఎన్నికకు జంకడానికి మరో కారణం కూడా లేకపోలేదు. మూడు జిల్లాల్లో కలసి లక్షల సంఖ్యలో వుండే ఫట్టభద్రుల కోసం ఊరూరు తిరగడం తమ వల్ల కాదని వారు పార్టీ అధిష్టానానికి తేల్చిచెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా పట్టభద్రుల హామీలను గుప్పించడం కూడా తమకు కష్టంగానే వారు భావిస్తున్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణల నేపధ్యంలో తాటికొండ రాజయ్యపై వేటు పడటంతో ఆయన స్థానంలో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఆయనతో పాటు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు కూడా మంత్రి పదవి చేపట్టిన ఆరు నెలల్లో చట్టసభలో అడుగుపెట్టాల్సి ఉంది. దీంతో అందివచ్చిన అవకాశాన్ని ఇరువులు నేతలు వద్దనుకుంటున్నారని సమచారం.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more