ప్రపంచకప్ 2015లో భాగంగా టీమిండియా జట్టులో యువరాజ్ సింగ్ కు స్థానం దక్కని విషయం తెలిసిందే! యువీ ఎంపిక కాకపోవడంతో క్రికెట్ అభిమానులతో పాటు ప్రముఖులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలాగే యువీ కూడా తొలుత ఆవేదన వ్యక్తం చేసినా.. అనంతరం ప్రస్తుత జట్టు ఆటగాళ్లకు అభినందనలు తెలిపాడు. ఇక చేసేదేమీలేక ఇంట్లోనే సేదతీర్చుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతను నిద్రపోతుండగా కొందరు సన్నిహితులు తట్టి లేపారు. అంతే.. ఇతని సంతోషానికి హద్దులేకుండా పోయింది. ఇంతకు ఏమి జరిగిందంటారు..? అది తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!
వివరాళ్లోకి వెళ్తే.. ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ -8 సీజన్ కార్యక్రమాలు అప్పుడే మొదలయ్యాయి. బెంగుళూరులో ఈ సీజన్ ఆటగాళ్లకోసం వేలపాట మొదలెట్టేశారు. ఈ వేలంలోనే యువరాజ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీలు రూ.16 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే.. ఈ విషయం యువీకి తెలియదు. ఈ వేలం జరుగుతున్న సమయంలో అతడు గాఢనిద్రలో వున్నాడు. అప్పుడే కొంతమంది మిత్రులు వచ్చి.. తన వేలం విషయం గురించి వివరించారు. ఏకంగా 16 కోట్లకు అమ్ముడుపోవడంతో హర్షం వ్యక్తం చేసిన అతని మిత్రులు యువీని అభినందించారు. ఇదే విషయమై యువీ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.
వేలం జరుగుతున్న సమయంలో తాను నిద్రపోతున్నానని, మిత్రులు కొంతమంది ఇంటికి వచ్చి అభినందించడంతో ఆ విషయం తెలిసిందని యువరాజ్ తెలిపాడు. మరోసారి గ్యారీ కిర్ స్టర్ కోచింగ్ లో ఆడబోతుండటం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు. గతంలో ఆయన శిక్షణలో మంచి విజయాలు సాధించానని తెలిపిన యువీ.. ఈసారి ఢిల్లీ డేర్ డెవిల్స్ తోనూ పునరావృతమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అటు.. యువీ ఇంత రేంజిలో అమ్ముడుపోవడంపై క్రికెట్ అభిమానులతోపాటు దిగ్గజాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more