అప్ అధ్యక్షుడు, ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మానస పుత్రికకు మోక్షం లభిస్తుందా..? ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలలో మూడు స్థానాలు మినహా 67 స్థానాలను కైవసం చేసుకుని 96 శాతం బలం వున్న అప్ మానస పుత్రిక ఆదరణకు నోచుకుంటుందా..? అన్న ప్రశ్నలకు సమాధానం ప్రస్తుతానికి లభించడం లేదు. ఇంతకీ అరవింద్ కేజ్రీవాల్ మాసన పుత్రిక అని దేనిని అభివర్ణిస్తున్నారు..? అనేగా మీ సందేహం. అదే జన్ లోక్ పాల్ బిల్లు.
గత ఏడాది సరిగ్గా ఫిబ్రవరి 14న కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అన్ని రాజకీయ పార్టీలను, పార్టీల ప్రముఖులను ఖంగుతినింపించారు. అయితే ఆయన రాజీనామాకు దారి తీసిన అంశం మాత్రం జన్ లోక్ పాల్ బిల్లు. దానిని అమోదించాలని ఆయన అప్పటి మద్దతు నిస్తున్న పార్టీ కాంగ్రెస్ ను కోరినా.. వారు మద్దతు ప్రకటించలేదు. ఈ తరుణంలో జన్ లోక్ పాల్ బిల్లుకు మద్దతినివ్వని పక్షంలో తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించినా అప్పటి మద్దతుదారులు వినిపించుకోలేదు, దీంతో ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీలో రాష్ట్రపతి పాలన కొనసాగుతూనే వచ్చింది. అయితే ఇప్పుడున్న సభా బలంతో జన్ లోక్ పాల్ బిల్లుకు అమోదం లభిస్తుందా అన్న ప్రశ్న తెరపైకి వస్తుంది.
సభలో పూర్తి మెజారిటీ వుండటంతో ఢిల్లీ అసెంబ్లీలో అమోదం లభించినా.. కేంద్రంలో జన్ లోక్ పాల్ బిల్లు అటెకెక్కనుందని సమాచారం. జన్ లోక్ పాల్ భిల్లను అమోదించడంలో కేంద్రం మూడు అంశాలలో అభ్యంతరాలను తెలపనున్నట్లు కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారి తెలిపారు. అవినీతికి పాల్పడిన పోలీసుల, ఢిల్లీ మున్సిఫల్ అధికారులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకునే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే వారంతా కేంద్ర ప్రభుత్వ ఆద్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించినప్పుడే అరవింద్ కేజ్రీవాల్ మానసపుత్రిక జన్ లోక్ పాల్ బిల్లుకు మోక్షం లభిస్తుందని అధికారి వెల్లడించారు. మరి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై ఎలా వత్తిడి తీసుకువస్తారో వేచి చూడాలి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more