నాగార్జున సాగర్ జలాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదం మరింత జఠిలంగా మారింది. సాగర్ పై రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు సాగర్ పై మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే కృష్ణా నది జలాలపై వివాదాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలే చర్చించుకొని, పరిష్కరించుకోవాలని కొన్ని రోజుల క్రితం కృష్ణా జలాల నీటి యాజమాన్య బోర్డ్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాలు రాసింది. చర్చల సారాంశాన్ని తనకు పంపాలని లేఖలో కోరింది. కానీ రెండు రాష్ట్రాలకు చర్చలకు రాలేదు. నాగార్జున సాగర్ నుండి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపి నీటిపారుదల అధికారులు ప్రయత్నించారు. దాన్ని తెలంగాణకు చెందిన ఇంజనీర్లు అడ్డుకున్నారు. దాంతో వివాదానికి తలెత్తింది. రెండు రాష్ట్కరాల అధికారులు వాగ్వాదానికి దిగడంతో సాగర్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం సాగర్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. అయితే రెండు రాష్ట్రాలు వివాదాన్ని పరిష్కరించేలా చర్చలు మాత్రం జరపడం లేదు.
అధికారల కన్నా రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు చేసిన వ్యాఖ్యలు సాగర్ సమస్యను మరింత పెంచాయి. రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు, తమ రాష్ట్రమే రైట్ అంటూ వాదిస్తున్నారు. ఇక పై ఆంధ్రప్రదేశ్ కు ఒక్క బొట్టు నీటిని కూడా వదిలేది లేదని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ కుండబద్దలు కొట్టారు. అయితే సాగర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కుందని, రెండు రాష్ట్రాలు సమానంగా పంచుకోవాలని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు. న్యాయంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటాను విడుదల చెయ్యాలని కోరుతున్నట్లు ఏపి నేతలు వాదిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more