తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన వరంగల్ యాత్ర నిరసల మధ్య ముగిసింది. టిఆర్ఎస్, ఎమ్మార్పియస్ కార్యకర్తలు చంద్రబాబు యాత్రపై నిరసనలు తెలిపారు. గట్టి పోలీస్ బందోబస్తు మధ్య చంద్రబాబు యాత్ర ముగిసింది. వరంగల్ యాత్ర ప్రారంభించడానికి ముందు చంద్రబాబు తెలంగాణ అమరవీరులకు నివాళర్పించారు. విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని, సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా మానసికంగా కలసి ఉండాలనేదే తన అభిప్రాయమని ఆయన చెప్పా రు. సమస్యల పరిష్కారం కోసం పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుందామంటే ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటాపై ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఆమోదం లేదని బాబు వ్యాఖ్యానించారు.
ఒక సారి విభజనకు గురైన రెండు రాష్ట్రాలు కలవవని ఆయన అన్నారు.విభజనకు గురైన రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరికి ఒకరు సహకరించుకోవాలని ఆశించారు. సున్నితమైన తెలంగాణ అంశంలో కొందరు పార్టీని ఇబ్బంది పెట్టాలని చూశారని అన్నారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని అప్పుడు ఆ నాడే అన్నాను. నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్కు, కరెంటు విషయంలో తెలంగాణకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more