ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకంటూ వున్న ప్రత్యేకతను చాటుకోవడంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ మానియాను ఎదుర్కొన్ని ఢిల్లీ పీఠాన్ని 67 అసెంబ్లీ స్థానాలతో కైవసం చేసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందే, పాలనా పగ్గాలను చేపట్టక ముందే కేంద్ర మంత్రులను కలసి ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను కల్పించాలని, ఢిల్లీలో అనధికారికంగా వుంటున్న మురికివాడల ప్రజలను క్రమబద్దీకరించాలని ఆయన కోరారు.
కాగా మంత్రివర్గం కూర్పులోనూ తానకెవరూ సాటిలేరని నిరూపించుకునేందుక కేజ్రీవాల్ సరికొత్తగా మంత్రిమండలి కూరుస్తున్నట్లు సమాచారం. బీజేపి పార్టీ సీనియర్ అద్వానీని మంత్రి మండలిలో పక్కన బెట్టగా, అప్ తమ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు కేజ్రీవాల్ కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ.. తాజా ఎన్నికల్లో ఆప్ గెలుపునకు కృషి చేసిన ఆయనకు డిప్యూటీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. అరవింద్ కేజ్రీవాల్తో కలిపి 11 మందితో కేబినెట్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్లో ఎవరెవరు ఉంటారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
కొత్తగా ఏర్పడే కేబినెట్లో పాత మంత్రులు ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉంది. సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్ తిరిగి కేబినెట్లోకి వచ్చే అవకాశం ఉంది మొత్తానికి కేజ్రీ క్యాబినెట్ లో మనీష్ సిసోడియా, సత్యంద్ర జైన్, ఆదర్శ్ శాస్త్రీ, సురబ్ భరద్వాజ్, జితేందర్ తోమర్, కపిల్ మిశ్రా, సందీప్ కుమార్, అసిం అహ్మద్ ఖాన్ లకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న . రాఖీ బిద్లాన్లు, గిరీశ్ సోనీ, సోమ్నాథ్ భారతీలకు కేబినెట్లో చోటు దక్కకపోవచ్చునని భావిస్తున్నారు. అప్ తరపున డిమోలీ నియోజకవర్గం నుంచి గెలిచిని అత్యంత పిన్న వయస్కుడు 26 ఏళ్ల ప్రకాష్ జర్వాల్ సహా, పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచిన అత్యంత పెద్ద వయస్కుడు హజారా లాల్ చౌహాన్ లకు కేజ్రీ క్యాబినెట్ లో స్థానం లభించకపోవచ్చునని తెలుస్తోంది.
కాగా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం సహా 11 మంది మంత్రల ప్రమాణస్వీకారానికి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సరిగ్గా గత ఏడాది అదే రోజున జన్ లోక్ పాల్ బిల్లు అమోదించకపోవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన కడిగిన ముత్యంలా ఢిల్లీ ప్రజల పూర్తి అమోదంతో పాలన పగ్గాలను చేపట్టనున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more