Sensex reaches new mile stone

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

Metal, auto shares lift Sensex by 154 points

కొత్త మైలు రాయిని తాకిన సెన్సెక్స్..

Posted: 01/22/2015 09:52 PM IST
Sensex reaches new mile stone

దేశీయ సూచీ పెన్సెక్స్ మరో మైలు రాయిని దాటింది. నిన్న లాభాలతో దూసుకెళ్లిన మార్కెట్లు ర్యాలీని కొనసాగించడంతో.. 29 వేల మార్కును తాకిన నెన్సెక్.. అ తరువాత కొద్దిగా ఒత్తిడిలకు తలొగ్గింది. కాగా నిన్న తాకిన 29 వేల మార్కును ఇవాళ అధిగమించింది. అటో సహా లోహానికి సంబంధించిన షేర్లు ర్యాలీని కోనసాగించడంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలను ఆర్జించాయి. దీనికి తోడు త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

ఈ నేపథ్యంలో బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 117 పాయింట్లు లాభపడి 29, 006 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు ఎగసి 8,761 వద్ద ముగిసింది. మెటల్, ఆటో రంగ షేర్లతో పాటుగా దీర్ఘకాలికి వినియోగకర సంస్థల (కన్జూమర్ డ్యురబుల్ ) ష్లేర్లు ర్యాలీని కొనసాగించడంతో మార్కెట్ ముందుకు దూసుకువెళ్లింది. ఈ క్రమంలో సన్ ఫిరామిడ్, యాక్సిస్ బ్యాంక్, టాటా మెటార్ కార్పోరేషన్, ఓఎన్జీసీ, సిప్లా సంస్థల షేర్లు లాభాల భాటలో పయనించగా, ఎన్టీపీసీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, హీరో మోటార్ కార్పోరేషన్, మారుతి సుజుకీ, ఐటీసీ లిమిటెడ్ నష్టాలను చవి చూశాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles