రంగారెడ్డి జిల్లాలో ఓ బాలిక పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. లోక్యా నాయక్ అనే రైతుకు చెందిన పొలంలో ఈ బాలిక పడిపోయింది. గండేడు మండలం గోవింద్పల్లి తండాకు చెందిన ఐదేళ్ల వయసున్న చిన్నారి ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది. దాంతో ఆమె బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు బాలికను రక్షించే చర్యలను చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా గండేడు మండలం గోవిందపల్లి తండాలో బోరు బావిలో పడిన ఆరేళ్ల అంజలి మృత్యుంజయురాలిగా క్షేమంగా బయట పడింది. దాదాపు ఎనిమిది అడుగుల లోతులో పడిపోగా రెవెన్యూ పోలీసు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పాపను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆరోగ్య పరీక్షల నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పాప తండ్రి దుబాయ్లో ఉండగా, తల్లి పూణెకు వలస వెళ్లారు. తల్లిదండ్రులు వలస వెళ్లడంతో అంజలి బంధువుల ఇంట్లో ఉంటోంది. మృత్యు ఒడిలోంచి బయట పడ్డ పాపను చూసేందుకు పరిసరగ్రామ ప్రజలు తండోపతండాలుగా అక్కడకు చేరుకున్నారు. పాప ప్రాణాలతో బయటపడడంతో అధికారులు వూపిరి పీల్చుకున్నారు.
పరిధిలోని గోవింద్పల్లి తాండాలో అదే గ్రామానికి చెందిన అంజలి అనే ఐదేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. దాంతో ఆమె బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు బాలికను రక్షించే చర్యలను చేపట్టారు. ఘటనాస్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. అప్పటికే 108 అంబులెన్సులను కూడా రప్పించారు.
బోరుబావిలో చిన్నారి పడిపోయిన సంఘటన తెలంగాణ రవాణ శాఖా మంత్రి దృష్టికి వెళ్లింది. మంత్రి మహేందర్రెడ్డి వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికారులతో మాట్లాడారు. చిన్నారిని వెలికితీసేందుకు సత్వరం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బోరు బావిలోకి ప్రాణవాయువును పంపించారు. సిబ్బంది బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపట్టారు. ఎట్టకేలకు సుమారు ఐదు గంటల తరువాత బాలికను క్షేమంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more