సంగీత ప్రపంచాన్ని వదిలివెళ్ళిన చక్రవర్తి మృతిపై కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. చక్రి గుండెపోటుతో చనిపోయినట్లు ఇంతకాలం భావించాము. ఆర్దిక ఇబ్బందులే ఇందుకు కారణం అయి ఉండొచ్చని అనుమానాలు కూడా వచ్చాయి. కాని రెండ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. చక్రి మరణంపై అనుమానాలు ఉన్నాయని మృతుడి భార్య శ్రావణి శనివారం రోజు మీడియా ముందుకు వచ్చింది. తన అత్తింటివారిపై అనుమానాలు ఉన్నాయనీ.., కాబట్టి మృతిపై విచారణ జరపాలని కోరింది. అంతేకాకుండా అత్తింటివారు తనను ఆస్తికోసం వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ ఫిర్యాదు ప్రకారం చక్రి కుటుంబ సభ్యులపై సెక్షన్ 498, 506 ప్రకారం కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.., ఆదివారం రివర్స్ పరిణామాలు జరిగాయి. చక్రి మరణంపై తమకూ అనుమానాలు ఉన్నాయని ఆయన తల్లి విద్యావతి, సోదరుడు నారాయణ తెలిపారు. అంతేకాకుండా కోడలు శ్రావణే చంపి ఉండొచ్చని విద్యావతి ఆరోపించారు. మరణంపై ధర్యాప్తు జరపాలని జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కోడలు తమను వేధించిందని కూడా చెప్పారు. ఇవే విషయాలను రాత్రి వరకు చాలా మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూల్లో చెప్పారు.
సీన్ టోటల్ గా రివర్స్ కావటంతో ఏం చేయాలో తెలియక పోలిసులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోవటంతో ఎవరి వాదనల్లో నిజం ఉందో తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా చక్రి మరణంపై అనుమానాలను ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. ఎందుకంటే చక్రిని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లగానే ఆయన చనిపోయారు అని డాక్టర్లు చెప్పారు. అక్కడ చికిత్స చేయనందున విష ప్రయోగం జరిగిందా..? లేదా అనేది తెలియదు. అదేవిధంగా మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదు. అటు మృతదేహానికి ఇప్పుడు శవపరీక్ష చేద్దామన్నా, ఆ అవకాశం లేకుండా గత నెల 15నే మృతదేహానికి దహన సంస్కారాలు జరిగాయి. ఖననం చేస్తేనే పోస్టుమార్టంకు అవకాశం ఉండటంతో ఎప్పుడెలా తేల్చాలో తెలియక తికమకపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more