అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించడంలో తనకూ సాటి ఎవరూ లేరని నిరూపించుకున్న శంకర్ దర్శకత్వంలో మరో విజువల్ వండర్ ‘ఐ’ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే! ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జవనరి 14వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్, ఆస్కార్ ఫిలిమ్స్ అధినేత రవిచంద్రన్ ఎప్పటినుంచో ప్రచార కార్యక్రమాలను కూడా ప్రారంభించేశారు.
అయితే నిర్మాతకు, ఫైనాన్స్ చేసిన పిక్చర్ మీడియా వర్క్స్’కు మధ్య ఆర్థిక లావాదేవీలు తలెత్తిన నేపథ్యంలో సదరు ఫైనాన్షియర్ తమకు అందాల్సిన మొత్తాన్ని ఇప్పించాల్సిందిగా హైకోర్టుకెక్కిన సంగతి విదితమే! దీంతో కోర్టు ఈ చిత్రాన్ని జవనరి 30వరకు ఆపాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మరి.. ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందోనని ప్రేక్షకులతోబాటు అందరిలోనూ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అయితే చివరగా ఆ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చేసిందని తాజా సమాచారం!
అనుకోకుండా ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కుపోయిన ‘ఐ’ మూవీ నిర్మాత రవి, సదరు పిక్చర్ మీడియా వర్క్స్ సంస్థతో కోర్టు వెలుపల అంగీకారానికి రావడానికి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో భాగంగా పివిపి అధినేత పొట్లూరి వరప్రసాద్ కూడా పాల్గొని.. తనవంతు సాయం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పిక్చర్ హౌస్ సంస్థ తమ కేసు వెనక్కి తీసుకోవడం.. కోర్టు మూవీ విడుదలకు అనుమతించడం అంతా యథావిధిగా జరిగిపోయింది.
చివరగా ఈ చిత్రం పండుగనాడు.. అంటే జనవరి 14వ తేదీన అద్భుతాలు సృష్టించడానికి సన్నద్ధం అవుతుంది. ఇదే విషయమై నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చారు. ‘ఐ’ చిత్రానికి ఇక ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు, ఇతర ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు. ‘ఐ’ మూవీకి సంబంధించి అన్నీ సమస్యలు క్లియర్ అయ్యాయి. హాలీవుడ్ స్థాయికి ధీటుగా తెరకెక్కిన ఈ మూవీని జవనరి 14న యూ/ఏ సర్టిఫికెట్’తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more