వివాదాస్పత స్వామీజీగా పేరోందిన స్వామి నిత్యానంద, ఆయన అందాల శిష్యురాలు సినీనటి రంజతలు మరో వివాదంలో చిక్కుకున్నారు. నిత్యానంద ఆశ్రమంలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆశ్రమ కంప్యూటర్ ఇంచార్జ్ సంగీత సంఘటనలో నిత్యానంద, రంజితపైల ప్రమేయం వుందని ఆరోపణలు వెల్లువెత్తడంతో నిత్యానంద, రంజితలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం బెంగళూరులోని బిడిది ఆశ్రమంలో తమిళనాడు తిరుచ్చికి చెందిన సంగీత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తమ కూతురు మృతికి నిత్యానంద, రంజితలే కారణమంటూ మృతురాలి తల్లి ఝాన్సీరాణి ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించడంతో నిత్యానంద రంజితలకు చిక్కులు వచ్చిపడ్డాయి.
తిరుచ్చికి చెందిన ఝాన్సీరాణి, సంగీత తల్లీకూతుళ్లు. వీరిరువురూ నిత్యానంద ఆశ్రమంలో సేవలు అందిస్తున్నారు. ఐతే ఝాన్సీ రాణికి మరోచోట ఉద్యోగం రావడంతో ఆమె వెళ్లిపోయింది. సంగీత అక్కడే ఉంటూ సేవలందిస్తోంది. డిసెంబరు 28న సంగీత మరణించిందని ఆశ్రమం నుంచి కబురు రావడంతో ఝాన్సీ అక్కడికి వెళ్లింది. పోస్టుమార్టం ముగిసిన అనంతరం కూతురు శవాన్ని తల్లికి అప్పగించడంతో ఆమె తిరుచ్చిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో కూతురు శరీరంపై గాయాలను చూసి షాక్ తిన్న ఝాన్సీ తమ శవానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలనీ, తన కుమార్తెను హత్య గావింపబడిందన్న అనుమానాన్ని వెలిబుచ్చింది. దీనికి కారణం నిత్యానంద, రంజితలేనంటూ బెంగుళూరు రామ్ నగర్ పోలీసులను ఆశ్రయించింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more