ఇప్పటికే ఉగ్రవాదుల సమస్య తో సత మవుతున్న పలు దేశాలు ఉగ్రవాదుల నుండి ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా భారత దెశ్కన్ని కొన్ని ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత ప్రభుత్వం ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపుతుంది. అనేక అంతర్జాతీయ సమావేశాల్లో ఉగ్రవాదాన్ని మట్టుపెట్టటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇప్పుడదే మనకు తీవ్ర ముప్పుగా ముంచుకొచ్చే ప్రమాదముందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు దేశ రాజధానిలో ఉగ్రవాదులు ఒక భయంకర విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లు కొన్ని పరిణామాలను చూస్తే అర్ధమవుతుంది.
ఢిల్లీ నగరానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే పరిస్థితులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో ఉగ్ర కుట్ర బయటపడింది. నొయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తుండగా శుక్రవారం పోలీసులకు చిక్కారు. ఢిల్లీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా సంస్థ(ఐబీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇటీవల జరిగిన బెంగళూరు బాంబు బ్లాస్ట్ కేసులో ఇప్పటికే మన భద్రత బలగాలన్ని అప్రమత్తం అయ్యాయి. బెంగళూరు లాంటిది కాకుండా ఇంకో భారి విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు కూడా అనుమానిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. వారి వద్ద లభించిన ల్యాప్ టాప్ లో కీలక సమాచారం లభించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం.
హరికాంత్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more