రోడ్లు బాగోలేవని, గొతుల మయమైన రోడ్లతో ఎన్నాళ్లు ఇబ్బందులు పడాలంటూ రోడ్డుపై బైఠాయించిన దంపతులకు పోలీసు మార్క్ ట్రిట్ మెంట్ లభించింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గొంతెత్తిన దంపతులను పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి.. రాత్రంతా వారిని ప్రశ్నలతో వేధించారు. కొందరు పోలీసులు దురుసు ప్రవర్తనతో వారిపై దాడి కూడా చేశారు. విషయం మీడియాకు తెలియడంతో ఇబ్బందిపడ్డ పోలీసులు.. ఎట్టకేలకు వారిని వదిలిపెట్టారు.
వివరాల్లోకి వెళ్లే.. బేగంపేటలో నివసించే చంద్రబాబు, జ్యోతి అనే దంపతులు బల్కంపేట నుంచి బేగంపేటకు వెళ్తుండగా, రోడ్డుపై వున్న గుంతలోకి వారి వాహనం దూసుకెళ్లడంతో వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. రోడ్ల పరిస్థితిని నిరసిస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని పోలిస్ స్టేషన్ కు తరలించారు. రాత్రంతా వారిని పోలిస్ స్టేషన్ లోనే వుంచి ప్రశ్నల వర్షం కురింపించారు. ఈ క్రమంలో పోలీసులకు, దంపతులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం మీడియాకు తెలసి వారు పంజాగుట్ట పీఎస్కు వెళ్లగా.... చందూ తాగి, పోలీసులతో ఘర్షణ పడినందుకే తాము అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు.
కాగా, తమను అన్యాయంగా పోలీసులు కొట్టారని బాధితురాలు జ్యోతి కన్నీటిపర్యంతమైంది. తాము బల్కంపేటలో బారసాల కార్యక్రమానికి హజరై వస్తున్నామని జ్యోతి తెలిపారు. పడిపోయిన తమను...ఏం జరిగిందో అడగకుండానే కానిస్టేబుల్ రావటం ...రావటమే దాడి చేశాడని ఆమె పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత కూడా తన భర్తను పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని, అడ్డు వెళ్లిన తనపై కూడా ప్రతాపం చూపారని జ్యోతి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రజాహితం కోసం రోడ్లు బాగుచేయాలని డిమాండ్ చేస్తే.. పోలీసులతో కొట్టిస్తారా అంటూ జ్యతి అవేదన వ్యక్తం చేశారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more