విజయవాడ నగరంలోని అతను దుర్గ గుడిలో ఫోటో లు విక్రయించే యువకుడు సత్య కుమార్, పైకి పాష్ గా కనిపిస్తూ తానేదో ధనవంతుని కొడుకు లాగ పోజు ఇచ్చేవాడు. ఒకరు మాజీ ప్రేమికురాలు..., మరొకరు భర్తను కాదని "సాంగత్యం' అక్రమ సంబంధం సాగిస్తున్న మహిళ.. తమతో కాకుండా మరో ఇద్దరితో అతడు ప్రేమాయణం సాగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమను మోసం చేసిన వ్యక్తి మరో ఇద్దరి జీవితాలతో ఆటాడుకోవడానికి సిద్దమవుతున్నాడని ఆ యువకుడికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అంతే మహిళా సంఘాలతో కలిసి విజయవాడ నగర పోలీసు కమిషనర్ను ఆశ్రయించారు. తమను మోసగిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగిన న్యాయం చేస్తానని మహిళలకు పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు.
ఆ వివాహిత మహిళ ఎవరో కాదు.., అదే ప్రాంతంలో అమ్మవారి ఫొటో ఫ్రేములు కట్టే వ్యక్తితో ఉన్న పరిచయం ఆధారంగా తరచూ అతను.. వారింటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతని భార్యపై కన్నేశాడు. ఒకసారి భర్త లేని సమయంలో ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఇద్దరు కలిసి చెట్ట పట్టా లేసుకొని తిరిగారు.ఆమెను చాల చోట్ల తిప్పి తన వంచ తీర్చుకున్నాడు. ఈమెకు కొంచెం భర్తతో "అనుబంధం" తక్కువగా ఉండటం మూలాన ఆమె ఆ యువకుడితో తిరుగుతూ అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఆపై ఆమెను ఎన్నో సార్లు నగరం లోని వివిధ ప్రదేశాలకు తీసుకెళ్ళి ఆ యువకుడు తన వాంఛ తీర్చుకునేవాడు. ఆ వివాహిత మహిళను తిప్పి తిప్పి తన కోరికలు తీర్చుకున్నాడు. పోనీ అలా కొనసాగించాడా అంటే అదీ లేదు. మల్లి వేరే అమ్మాయితో ప్రేమాయణాన్ని కొనసాగించాడు.
ఆ యువకుడు మళ్ళి అదే ప్రాంతానికి చెందిన మరో యువతితో ఐదేళ్లపాటు ప్రేమాయణం సాగించాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా, మరొకరిని వివాహం చేసుకుంది. ఆమె భర్తకు విషయం చెప్పి కాపురాన్ని చెడగొట్టాడు. ఆ తర్వాత ఆమెతో కూడా ప్రేమను పంచుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో ఉంటూ తన వాంఛ తీర్చుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం ఫ్రేములు కట్టే వ్యక్తి భార్యతో ఊరెళ్లి కొద్దిరోజులు గడిపిన తర్వాత తీసుకొచ్చి విజయవాడలో వదిలేశాడు. ఆమెను అక్కడ ఎదో రూమ్ కి తీసుకెళ్ళి యాద్దరు కలిసి కొన్ని రోజులు గడిపినట్లు తెలుస్తుంది. అక్కడ ఊర్కే వాంఛ తీర్చుకుంటూ వేధించేవాడని ఆ వివాహిత మహిళా తన గోడు వేల్లబోసుకుంది.
ఈ విషయం కాస్తా ప్రస్తుతం కాపురం చేస్తున్న మాజీ ప్రేమికురాలికి తెలిసి సత్యకుమార్ను నిలదీయగా.. చంపుతానని బెదిరించాడు. చేతనైంది చేసుకొమ్మన్నాడు. ఇతడి గురించి ఆరా తీసి మరో ఇద్దరు విద్యార్థినులతో ఇతడు సంబంధం నెరుపుతున్నట్టు తెలుసుకున్నారు. వారిని ఇతడి బారి నుంచి రక్షించాలని నిర్ణయిం చుకున్నారు. అక్కడ మహిళా నేతలను ఆశ్రయించారు.
ఆ మహిళ నేతలతో కలిసి మంగళవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును కలిశారు. బాధితులకు తగిన న్యాయం చేయాలని కోరారు. మరో ఇద్దరు యువతులు మోసపోకుండా చూడాలన్నారు. వీరి విషయాన్ని సావధానంగా విన్న పోలీసు కమిషనర్.. తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు వన్టౌన్ ఇన్స్పెక్టర్తో చెప్పారు. ఆ ఇద్దరు మోసపోకూడదనే..తమలా మరో ఇద్దరు మోసపోకూడదనే నగర పోలీసు కమిషనర్ను కలిసినట్టు బాధిత మహిళలు విలేకరులకు తెలిపారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అతని కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరారు. ఆ నిందితుడు పరారి లో ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా మహిళలలతో జల్సాలు చేస్తూ తన కోరికలు తీర్చుకొని ఆ మహిళలను వేధిస్తున్న యువకుడికి తగిన బుద్ధి చెప్పాలని మహిళా సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
హరి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more