దశల వారిగా జరిగిన జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. ఎనమిది గంటల నుంచి ప్రారంభం అవుతున్న కౌంటింగ్ లో 9గంటల నుంచి అభ్యర్ధుల ఆధిక్యత తెలియనుంది. జమ్మూలోని 87 స్థానాల్లో పోలింగ్ జరిగింది. గత పరిస్థితులకు పూర్తి భిన్నంగా.., ఉగ్రవాదులు, వేర్పాటువాదులు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ ప్రజలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. అటు ఈ దఫా కాశ్మీరాన వికసించాలని చూస్తున్న కమలం ఇందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
అటు కాశ్మీర్ ఫలితంపై భారత్ ఎంత ఆసక్తిగా ఎదరుచూస్తుందో.., అంతకంటే ఎక్కువగా పాక్ ఎదురుచూస్తోంది. కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని.., ఉపఖండంపై యుద్ధానికి సహకరిస్తామని నోటి దురుసును చూపిస్తున్న పాక్ నేతలు ప్రజలు ఏం కోరుకుంటున్నారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిమప్రాంతంలో బీజేపి అధికారంలోకి వస్తే మాత్రం పాకిస్థాన్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందని చెప్పాయి. ఓటరు నాడి ఏం ఫలితం ఇచ్చిందనేది కొద్ది గంటల్లో తెలియనుంది.
ఇక కొత్తగా ఏర్పడి మావో ప్రభావిత రాష్ర్టంగా మారిన జార్ఖండ్ లో కూడా ఓట్ల లెక్కింపు జరగనుంది. 81 స్థానాలకు జరిగిన ఎన్నికలకు 66శాతం పోలింగ్ నమోదయింది. ప్రధాన పోటి జార్ఖండ్ ముక్తి మోర్చా, బీజేపీ-ఏజేఎస్.యూ. యూటమి మద్య ఉంది. 14 సంవత్సరాల్లో ఇప్పటివరకు 9 సార్లు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఏ సర్కారు కూడా ప్రజలకు స్థిర పాలన అందించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ దఫా సుస్థిర పాలన అంటూ ప్రచారం చేసిన బీజపి ప్రజల్లో కొత్త ఆశలు రేపింది. ప్రజల మనోభావాలు గుర్తించి రాష్ర్టాన్ని ఇచ్చిన తమకే వారికి తగినట్లు పాలన అందించే సత్తా ఉందని కమల నేతలు చెప్పారు. ఈ ప్రచారానికి ఎక్కువ ఓట్లు పడి.., అధికారం చేపట్టే అవకాశం ఉందని అంచనా ఫలితాలు చెప్తున్నాయి. ఈ ఫలితాలు ఎలా ఉన్నా.., ఓటర్లు ఎవరికి పగ్గాలు అప్పగించనున్నాడు కొద్ది గంటల్లో తేలనుంది.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more