బీహార్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన లాలు ప్రసాద్ యాదవ్.., దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని పాలిస్తున్న సమాజ్ వాది పార్టీ అధినేత అయిన శ్రీ ములాయం సింగ్ యాదవ్ రాజకీయంగానే కాదు బందుత్వంతోను ఒక్కటి కాబోతున్నారు. బి జె పి ని ఎదుర్కునేందుకు మరియు దేశంలో ఒక రాజకీయ శక్తిగా ఎదేగేందుకు ఇప్పటికే రాజకీయంగా పావులు కదుపుతున్న యాదవ త్రయం తమ తదుపరి తరంతో బంధువులుగా మారుతున్నారు. లాలు ప్రసాద్ యాదవ్ చిన్న కుమార్తె రాజ్య లక్ష్మి కి ములాయం సింగ్ మనవడు అయిన శ్రీ తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ కి వివాహ నిశ్చితార్థం ఈ వారంలో జరగబోతుంది. సోమవారం దానికి ముందు జరిగే కార్యక్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొనబోతున్నారు. దీనికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్ కూడా హాజరవుతున్నారు. ములాయం సింగ్ ఈ విషయమై మాట్లాడుతూ మా బంధం ఇలాగే ఎల్లకాలం కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తేజ్ ప్రతాప్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. మెయిన్ పురి నియోజకవర్గ ఎం.పి గా మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ నుండి గెలుపొందారు. అంతకు ముందు ఈ నియోజకవర్గానికి ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. తేజ్ ప్రతాప్ తండ్రి ములాయం సింగ్ గారి అన్నయ్య కుమారుడు. ఇతను ఢిల్లీ దగ్గరలోని నోయిడాలో అమిటీ యూనివర్సిటీ లో విద్య అభ్యసిస్తున్నపుడు అదే యూనివర్సిటీ లో చదువుకుంటున్న లాలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రాజ్యలక్ష్మి ఇరువురు ప్రేమించుకున్నారు. పెళ్లి ముహూర్తాన్ని ఫిబ్రవరి నెలలో జరిగేలా ఖరారు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more