రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి గద్గెనెక్కిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ధర్నా చేస్తానని ప్రకటించగానే దిగివచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. ఇలానైనా రాష్ట్ర రైతాంగానికి మేలు జరిగితే చాలునన్నారు. ఎన్నికల హామీలో చెప్పినట్లు రాష్ట్ర రైతాంగం మొత్తం రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని నాని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ.... ఈ నెల తమ పార్టీ అధ్యక్షడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధర్నా అని ప్రకటించగానే... 4వ తేదీనే రుణమాఫీపై ప్రకటన అంటూ చంద్రబాబు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ అన్నయ్యగా ప్రతిపైసా తానే కడతానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరార ప్రచారం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీకి నీళ్లు వదిలారని చెప్పారు. రైతు సాధికారిక సంస్థ పేరుతో రైతాంగాన్ని మభ్య పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతాంగాన్ని ఎందుకిలా మోసం చేస్తున్నారంటూ చంద్రబాబును పేర్నినాని సూటిగా ప్రశ్నించారు. రోజుకోమాట, పూటకో ప్రకటనతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేలా కృషి చేస్తుందని చెప్పారు. 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉండి ఆ తర్వాత అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నైజం ఇప్పటికీ మారలేదని ప్రజలు గుర్తించారని పేర్ని నాని పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more