జమ్మూ ప్రజల తమ మాటలను లక్ష్య పెట్టకుండా ఓటింగ్ లో పాల్గొంటూ.. భారీ స్థాయిలో రికార్డు పోలింగ్ నమోదు కావడంతో.. ఇక తమ ఆటలు సాగవన్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. నియంత్రణ రేఖను దాటి అక్రమంగా భారత భూభాగంలోకి చోచ్చుకోచ్చారు. ఇక్కడ అప్పటికే తిష్టవేసిన మరికోందరు ఉగ్రవాదులతో కలసి కాశ్మీర్ లో విధ్వంస రచనకు కుట్రలు పన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని నౌగామ్ సెక్టార్ లోకి వచ్చిన తీవ్రవాదులకు చోచ్చకోచ్చారన్న సమాచారంతో భద్రతా ధళాలు వారిని చుట్టముట్టాయి
ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో వారిని పారిపోనీయకుండా వారిని భద్రతాదళాలు చుట్టుముట్టడంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. భారత భద్రతా దళాలు కూడా గట్టిగానే బదులిచ్చాయి. తీవ్రవాదులకు భద్రత సిబ్బందికి మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో మొత్తం ఐదుగురు తీవ్రవాదులు మరణించారని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇద్దరు ఉగ్రవాదులను నౌగామ్ సెక్టార్ లో తుదముట్టించిన భారత ఆర్మీ, మరో ముగ్గురిని టుట్ మారీ గలీ సెక్టార్ లో మట్టుబెట్టింది. ఈ కాల్పుల్లో భారత భద్రతా దళానికి చెందిన జూనియర్ కమీషన్ అధికారి కూడా మరణించారని అధికారులు తెలిపారు.
మరో ముగ్గురు సైనికులు కూడా కాల్పుల్లో గాయపడ్డారని, వారని ఆస్పత్రికి తరలించి చికిత్స నందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల వద్ద నుంచి రైఫిళ్లతో పాటు భారీగా ముందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దీంతో పాటు ఉగ్రవాదుల వద్దనున్న యుద్ద సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత భూభాగంలో మరెవరైనా ఉగ్రవాదులు వున్నారన్న అన్న అంశంపై ముమ్మర తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more