భారతీయ వీదేశీ పర్యాటకులకు నెల రోజుల ముందుగానే ఫ్రాన్స్ ప్రభుత్వం కానుకను అందజేసింది. ఫ్రాన్స్ లో నూతన సంవత్సర వేడుకలు మొదలుకుని, పర్యాటక ప్రాంతాలన్నింటినీ కలియ తిరిగి వచ్చేందుకు అసంఖ్యాక పర్యటకులకు అనుమతినిచ్చింది. అంతేకాదు పర్యటాక వీసాలను కేవలం 48 గంటల్లో అందించేందుకు సిద్దమని ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఎనమిది కేంద్రాల నుంచి భారత పర్యాలకులకు వీసాలను అందేజేసేందుకు సిద్దమైంది. ఫ్రాన్స్ దేశానికి పెరుగుతున్న భారత పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆ దేశ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వున్న ఢిల్లీలోని దౌత్యకార్యాలయంతో పాటు పుద్దుచ్చరీ, కోల్ కత్తా, బెంగళూరు, ముంబాయి నగరాలలో వున్న ఫాన్స్ కేంద్రాల నుంచి డిసెంబర్ 1 నుంచి 48 గంటల్లో వీసా లభించనుంది. దీంతోపాటు కొత్తగా తెరవనున్న మరో ఎనమిది కేంద్రాల ద్వారా 78 గంటల్లో వీసా వచ్చి చేరుతుంది ఢిల్లీలోని దౌత్యకార్యాలయం వద్ద ఛలో పారిస్ మొబైల్ అప్లికేషన్ ను అవిష్కరించిన దౌత్యవేత్త ఫ్రాన్ కోయస్ రిచర్ ఈ ఆప్ తో పారిస్ పర్యటనకు వచ్చే పర్యాటకులు అక్కడి సమాచారం అందుబాటులో వుంటుందని తెలిపారు. అక్కడి హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ ప్రాంతాలు, నార్మండీ, లోర్ వ్యాలీ, మాంట్ సెయింట్ మైఖిల్, బార్ డియాక్స్ ప్రాంతాలతో పాటు అనేక వివరాలు యాప్ సాయంతో లభ్యమవుతాయని చెప్పారు.
భారత్ నుంచి కూడా ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు పారిస్ పరిసర పర్యాటక ప్రాంతాను వీక్షించడానికి వస్తున్నారని తెలిపారు. అందుచేతే తాము ఇండియాలో పారిస్ ప్రమోషన్ పనులను చేపట్టినట్లు చెప్పారు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత ధృడమైన బంధం ఏర్పర్చుకునే పనిలో భాగంగా నెలకోన్న అడ్డంకులను తోలగిస్తున్నామన్నారు. కొత్త ఏడాది నుంచి పర్యాటకంతో పాటు వ్యాపార వీసాలను కూడా కేవలం 48 గంటల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటి వరకు పారిస్ ను సందర్శించిన పర్యాటకుల సంఖ్యలో 33 శాతం వృద్ది సాధించినట్లు ఫ్రాన్ కోయస్ రిచర్ తెలిపారు.
ప్రతీ ఏడాది సగటున మూడున్నర లక్షల మంది భారతీయులు పారిస్ ను సందర్శించే వారిలో వున్నారని, అయితే ఇది పారిస్ ను సందర్శించే మొత్తం పర్యటకుల సంఖ్యతో పోల్చితే కేవలం 0.23 శాతంగా వుందన్నారు. ఈ ఏడాది అక్టోబర్ మాసాంతం వరకు 80 వేల మంది భారత పర్యాటకులు ప్రాన్స్ లో పర్యటించారని, మిగిలిన ఈ రెండు నెలల్లో ఆ సంఖ్య మరో పది వేలు పెరిగి 90 వేలకు చేరుకుంటుందని ఫ్రాస్స్ దౌత్యకార్యలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more