భారత్ తో చర్చలు జరిపేందుకు తామ సిద్దంగా వున్నామని దాయాది పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ప్రకటించిన మరుసటి రోజున పాకిస్థాన్ తో చర్చలు లేవని భారత్ విదేశాంగ శాఖ తే్ల్చిచెప్పింది. సార్క్ దేశాల సదస్సులో భాగంగా ఖట్మండులో భారత్ సహా పాకిస్థాన్ ప్రధాని చేరుకోవడంతో ఇరు దేశాల మధ్య సదస్సు ముగిసిన తరువాత చర్చలు జరుగుతాయన్నవార్తలు వచ్చాయి. అయితే ఖట్మండులో ప్రధాని నరేంద్రమోడీ నిర్ధేశించిన షెడ్యూల్ ప్రకారం ఎలాంటి చర్చలు లేవని విదేశాంగ శాఖ స్పస్టం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ల మధ్య ప్రస్తుతానికి ఎలాంటి భేటీ లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ నేపాల్ రాజధాని కాట్మాండ్లో స్పష్టం చేశారు. ఇరు దేశాల నేతల మధ్య భేటీకి ఇప్పటి వరకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు. 18వ సార్క్ సమావేశాలు కాట్మాండ్లో ప్రారంభమైన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి పాకిస్థాన్ తో చర్చల విషయం ప్రధాని షెడ్యూల్ లో లేదని చెప్పారు.
దీంతో భారత్, పాక్ నేతలు ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలపై చర్చించే అవకాశం ఉందా అని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సయ్యద్ అక్బరుద్దీన్ లేదని తేల్చిచెప్పారు. ఇటీవల కాలంలో భారత్పై పాకిస్థాన్ తరచుగా కాల్పులకు తెగబడుతు గతంలో ఇరుదేశాలు మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి.. కాల్పులను పూర్తిగా విరమించిన తరువాత పాకిస్థాన్ తో చర్చలు జరుపుతామని ఇదివరకే భారత్ స్పస్టం చేసింది. కాగా పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్షరీష్ భారత్ అంగీకరిస్తే చర్చలకు సిద్దమన్న నేపథ్యంలో ఇరుదేశాల ప్రధానులు సార్క్ సమావేశాలలో భాగంగా భేటీ అవుతారన్న వార్తలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more